Drishyam 3: కరుప్పు రికార్డులు బద్దలు కొట్టిన దృశ్యం 3.. మోహన్‌లాల్‌ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల సునామీ

Published : May 22, 2026, 10:13 PM IST

Drishyam 3: మే నెలలో ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రెండు సినిమాలు సూర్య 'కరుప్పు', మోహన్‌లాల్ 'దృశ్యం 3'. వీటిలో కరుప్పు సినిమా రికార్డులను బద్దలు కొడుతూ దృశ్యం 3 మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.  

PREV
15
కరుప్పు కలెక్షన్లు వర్సెస్‌ దృశ్యం 3
మే నెలలో ఇండియా మొత్తం ఎదురుచూసిన రెండు పెద్ద సినిమాలు సూర్య 'కరుప్పు', మోహన్‌లాల్ 'దృశ్యం 3'. కరుప్పు రికార్డులను బద్దలు కొడుతూ దృశ్యం 3 మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. కరుప్పు మొదటి రోజు రూ.28.93 కోట్లు వసూలు చేయగా, దృశ్యం 3 ఆ రికార్డును అధిగమించింది.
25
దృశ్యం 3 గ్రాండ్‌గా రిలీజ్‌

మలయాళంలో ఈ మధ్య భారీ ప్రీ-రిలీజ్ హైప్‌తో వచ్చిన సినిమా 'దృశ్యం 3'. మోహన్‌లాల్ పుట్టినరోజు నాడే రిలీజ్ అవ్వడంతో అభిమానులకు డబుల్ ట్రీట్ అయింది. ఫస్ట్ షో తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో 'బుక్ మై షో'లో టికెట్ల అమ్మకాలు జెట్ స్పీడ్‌లో జరిగాయి. ఒకానొక దశలో గంటకు 41,000 టికెట్లు అమ్ముడయ్యాయి.

35
దృశ్యం 3 భారీ ఓపెనింగ్స్
అధికారిక సమాచారం ప్రకారం, ఈ సినిమాను నిన్న 67 దేశాల్లో రిలీజ్ చేశారు. మొదటి రోజు సాయంత్రం 4 గంటలకే థియేటర్ ఆక్యుపెన్సీ 90 శాతానికి పైగా చేరింది. దీంతో కేరళలో మాత్రమే నిన్న 500కు పైగా లేట్ నైట్ షోలు వేశారు. ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకర్ సాక్‌నిల్క్ ప్రకారం, ఈ చిత్రం ఇండియాలో మొదటి రోజు రూ.18.37 కోట్ల గ్రాస్, రూ.15.85 కోట్ల నెట్ వసూలు చేసింది.
45
హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీ దృశ్యం 3

జీసీసీ సహా ఓవర్సీస్ మార్కెట్లలోనూ ఈ సినిమాకు మొదటి రోజు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు వసూళ్లు రూ.48.37 కోట్లు అని అంచనా వేస్తున్నారు.  ఇది అత్యధిక ఓపెనింగ్‌ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సూర్య కరుప్పు మూవీ రికార్డుని `దృశ్యం 3` బ్రేక్‌ చేసిందని చెప్పొచ్చు. 

55
దృశ్యం 3 సంచలనం
ఏది ఏమైనా, 'ఎంపురాన్' తర్వాత మలయాళ సినీ చరిత్రలో రెండో అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన చిత్రంగా 'దృశ్యం 3' నిలిచింది. మూడో స్థానంలో ఉన్న 'పేట్రియాట్' మొదటి రోజు రూ.28.05 కోట్లు వసూలు చేసింది. 'ఎంపురాన్' సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.68.20 కోట్లు వసూలు చేయడం విశేషం.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories