
ఏపీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య, బిగ్ బాస్ కంటస్టెంట్ దివ్వెల మాధురి తాజాగా తన విశ్వరూపం చూపించింది. ఆమె ఇటీవల బిగ్ బాస్ తెలుగు 9కి వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆదివారమే ఎలిమినేట్ అయ్యింది. ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ద్వారా మాధురి హౌజ్లోకి వెళ్లిన ఆమె అందులో మూడు వారాలే ఉంది. ప్రారంభంలో రెండు మూడు రోజులు రచ్చ చేసిన మాధురి ఆ తర్వాత కామ్ అయిపోయింది. కేవలం సెటైర్లు, కౌంటర్లకే పరిమితమయ్యింది. దీంతో ఆమె తీరు ఆడియెన్స్ కి నచ్చలేదు. దీంతో ఈ వారం ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.
ఇక బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన దివ్వెల మాధురి పలు మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెల్స్ తో మాట్లాడింది. అందులో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జర్నలిస్ట్ జాఫర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఫైర్ అయ్యింది. హౌజ్లో భరణితో కలిసి డాన్సు చేయడం అశ్లీలంగా ఉందని సోషల్ మీడియాలో ట్రోల్స్ అయన నేపథ్యంలో ఇదే విషయాన్ని ప్రశ్నించారు జాఫర్. దీంతో ఆమె మండి పడింది. భరణితో డాన్స్ చేయడంలో అశ్లీలం ఏముందంటూ ప్రశ్నించింది. తాను ఆయన్ని పట్టుకుని, హగ్ చేసుకొని డాన్సు చేయలేదని, నాగార్జున చెప్పినందువల్లే డాన్స్ వేయాల్సి వచ్చిందని తెలిపింది. దాన్ని ఎవరూ కాదనరని, అది దీపావళి పండగ సందర్భంగా చేసిందని వెల్లడించింది. అందులో తప్పేముందని ఆమె ప్రశ్నించింది.
ఇలా తనని ట్రోల్ చేసిన వాడు అమ్మకే పుట్టలేదు. వాడు ఎవడో నాకు తెలియదు, వాడైతే అమ్మకే పుట్టలేదు. ఎవడికి పుట్టాడో కూడా తెలియదు, అంతటి నీచాతి నీచంగా చేసిన వాడు నా దృష్టిలో మనిషే కాదంటూ మండిపడింది. భరణితో డాన్స్ చేయడాన్ని ఎందుకు రిజెక్ట్ చేయలేదని ప్రశ్నించగా, ఎందుకు రిజెక్ట్ చేస్తాను, నాగార్జున చెప్పాక అలా కుదరదని, అయినా చేయి చేయి పట్టుకుని డాన్సు చేయమంటే, హగ్ చేసుకుని డాన్సు చేయమంటే రిజెక్ట్ చేసేదాన్ని అని తెలిపింది మాధురి. దీనిపై దువ్వాడ శ్రీనివాస్ కూడా స్పందించారు. మాధురి ఏంటో నాకు తెలుసు, నేనేంటో ఆమెకి తెలుసు, మధ్యలో ఎవరో ఒకడు తొక్కలో కామెంట్ చేశాడని, ట్రోల్ చేస్తే పట్టించుకోనని తెలిపారు.
ఈ సందర్భంగా భరణి రీఎంట్రీపై హాట్ కామెంట్ చేసింది మాధురి. నాగబాబు వల్లే ఆయన హౌజ్లోకి వచ్చినట్టు తెలిపింది. వెనకాల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు, వారి సపోర్ట్ తోనే, వారి ఒత్తిడితోనే ఆయన్ని మళ్లీ హౌజ్లోకి తీసుకొచ్చారని వెల్లడించింది. ఒక్కసారి ఆడియెన్స్ ఓట్ల ద్వారా ఎలిమినేట్ అయినవాడు, మళ్లీ ఆడియెన్స్ ఓట్లతో ఎలా హౌజ్లోకి వస్తారని మాధురి ప్రశ్నించింది. ఈ సందర్భంగా తనూజ, భరణిని నాన్న అని పిలవడంపై స్పందిస్తూ, ప్రపంచంలో నాన్న అని కూతురు, కొడుకు మాత్రమే పిలుస్తారని స్పష్టం చేసింది. కానీ ఎవరు పడితే వాళ్లు నాన్న అని పిలవరని తెలిపింది. అమ్మ అని కామన్ గా పిలుస్తారని, కానీ నాన్న విషయంలో అలా పిలవడం కరెక్ట్ కాదని, అది తనకు తప్పు అనిపించింది, అందుకే తనూజకి చెప్పినట్టు వెల్లడించింది మాధురి. తాను చెప్పాలనుకున్నది చెప్పాను, కానీ వాళ్లు ఇప్పటికీ అలానే ఉంటున్నారు. అది వాళ్ల ఇష్టమని చెప్పింది మాధురి.
బిగ్ బాస్ అనుభవాలను, బయటకు రావడానికి సంబంధించిన మాధురి స్పందిస్తూ, ఫుడ్ సరిగా అందలేదని, బయట నా మనుషులు ఎలా ఉన్నారనే టెన్షన్ ఉందని, ఇవన్నీ క్యారీ చేస్తూ హౌజ్లో ఉండటం చాలా టఫ్ అనిపించిందని తెలిపింది. రీతూ, డీమాన్ పవన్ల రిలేషన్ కూడా ఫేక్ అని, వాళ్లు ఓటింగ్ కోసం గేమ్ ఆడుతున్నారని తెలిపింది. అలాగే భరణి, దివ్యలది కూడా ఫేక్ రిలేషన్ అని తెలిపింది. మిగిలిన వారు ఎవరి గేమ్ వాళ్లు ఆడుతున్నారని తెలిపింది మాధురి. అంతేకాదు బిగ్ బాస్ పై సంచలన కామెంట్ చేసింది. ఓటింగ్ ప్రకారం అయితే ఎలిమినేషన్ జరగడం లేదని, వాళ్లకి నచ్చిన వాళ్లని ఉంచుతున్నారు, నచ్చని వాళ్లని పంపిస్తున్నారని ఆరోపించింది. ఇప్పుడు ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.