ఈ మధ్య చిత్ర పరిశ్రమలో బ్రేకప్ వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. పెళ్లైన జంటలు విడిపోవడం, ప్రేమికులు బ్రేకప్ చెప్పుకోవడం వినిపించింది. అదే సమయంలో లవర్స్ పెళ్లిళ్లు చేసుకోవడం, కొత్త ప్రేమలు పుట్టుకు రావడం కూడా జరుగుతుంది. సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన ఈ వార్తలు మరింత హాట్ టాపిక్ అవుతున్న నేపథ్యంలో తాజాగా మరో జంట విడిపోయినట్టు వార్తలు ఊపందుకున్నాయి.
బాలీవుడ్లో మోస్ట్ లవబుల్ కపుల్, హాట్ జోడీ, సెక్సీ జంటగా పేరున్న దిశా పటానీ(Disha Patani), టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) విడిపోయారంటూ ఓ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ని షేక్ చేస్తుంది. అత్యంత ఘాటు ప్రేమికులుగా రాణిస్తున్న ఈ జంట విడియారనే వార్తలు బాలీవుడ్లోనూ హాట్ టాపిక్గా మారాయి. ఎంతో క్లోజ్గా ఉండే ఈ జంట సడెన్గా విడిపోవడమేంటనేది సస్పెన్స్ గా, హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఇద్దరి మధ్య ఏవో మనస్పర్థాలు వచ్చాయని, దీంతో ఎవరి దారులు వాళ్లు చూసుకోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. ఈ జంట(Disha Patani Tiger Shroff Breakup) విడిపోయిందనే న్యూస్ అందరిని షాక్కి గురి చేస్తుంది. ఎంతో ప్రేమతో ఉండే ఈ జంట విడిపోవడమేంటనేది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే దిశా పటానీ క్లోజ్ ఉండే సన్నిహితులు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. అందులో నిజం లేదని అంటున్నారు.
ఈ రూమర్స్ పై ఈ జంట స్పందించాలనుకోవడం లేదట. తాను బ్రేకప్ రూమర్ల దూరంగా ఉండాలని, రియాక్ట్ కాకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అయితే ఓ రకంగా ఇది రియాక్ట్ కాకపోవడం కూడా నిజమే అనే సంకేతాలనిస్తుందని అంటున్నారు. మరి ఏంజరగబోతుందనేది చూడాలి. కానీ ఇది బాలీవుడ్లోనే కాదు, టాలీవుడ్, సామాజిక మాద్యమాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారడం విశేషం.
`లోఫర్` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది దిశా పటానీ. పూరీ హీరోయిన్గా పేరుతెచ్చుకున్న ఈ భామ ఒకేఒక్క తెలుగు సినిమా చేసి బాలీవుడ్కి చెక్కేసింది. అక్కడ వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. `కుంగ్ ఫూ యోగా`, `బాఘి2`, `భారత్`, `మలంగ్`, `బాఘి 3`, `రాధే` చిత్రాల్లో నటించింది. `బాఘి 2`లో టైగర్తో కలిసి నటించింది.
అయితే అంతకు ముందు టైగర్ ష్రాఫ్ సిస్టర్ క్రిష్ణ ష్రాఫ్ దిశాకి మంచి ఫ్రెండ్. ఆమె కోసం వారింటికి వెళ్లగా, టైగర్తో పరిచయం ఏర్పడిందని, అది ప్రేమగా మారిందని సమాచారం. అయితే `బాఘి2` సినిమా టైమ్లో వీరి ప్రేమ మరింత బలపడిందని టాక్. ఆ తర్వాత `బాఘి 3`లోనూ టైగర్ కోసం స్పెషల్ సాంగ్లో మెరిసింది దిశా పటానీ. ఇప్పుడు `ఏక్ విలన్ రిటర్న్స్`, `యోధ`, `కేటీనా` చిత్రాల్లో నటిస్తుంది. దాదాపు ఏడేళ్ల తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ప్రభాస్ సరసన `ప్రాజెక్ట్ కే`లో నటిస్తుంది దిశా. మరోవైపు టైగర్ ష్రాఫ్ సైతం చాలా బిజీగా ఉన్నారు. `స్క్రూ ఢీలా`, `గణపత్ః పార్ట్ 1`, `బడేమియా చోటే మియా` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉంటే దీనిపై టైగర్ ష్రాఫ్ ఫాదర్, నటుడు జాకీ ష్రాఫ్ రియాక్ట్ అయ్యారు. టైగర్, దిశా కలిసి బయటకు వెళ్లడం నేను చాలా సార్లు చూశానని తెలిపారు. వాళ్లిద్దరు మంచి స్నేహితులని, ఇప్పటికీ వారి మధ్య స్నేహం ఉందన్నారు. వాళ్ల లవ్ లైఫ్లోకి తాను ఇన్వాల్వ్ కానని తెలిపారు. వారిద్దరు చనువుగా ఉన్నారా? లేక విడిపోయారా? అనేది వారిష్టం. అది వారి లవ్ స్టోరీ. నేను నాభార్యతో ప్రేమ కథ నడిపిస్తున్నా` అని తెలపడం విశేషం.