వరుణ్ తేజ్ హీరోగా .. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన లోఫర్ సినిమాతో తేరంగేట్రం చేసింది దిశా పటాని. టాలీవుడ్ ఎంట్రీతోనే ఆమె మూవీ కెరీర్ స్టార్ట్ అయ్యింది.. అంతకు ముందు మోడల్ గా మెప్పించి.. ఆతరువాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది. ఈ ముంబై భామ తర్వాత బాలీవుడ్లో వరుస ఆఫర్స్తో దూసుకుపోతోంది. హీరోయిన్ గానే కాకుండా ఐటమ్ సాంగ్స్ తోనూ బిజీగా ఉంది.
బాలీవుడ్ గుమ్మం తొక్కగానే.. సైత్ వైపు కన్నెత్తి కూడాచూడలేదు చిన్నది. కాని త్వరలో తమిళ సినిమాలో మెరపులు మెరిపించబోతోంది. దిశ ఇప్పుడు మళ్లీ దక్షిణాదిపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆమె ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కె లో నటిస్తోంది.
ఇక రీసెంట్ న్యూస్ ప్రకారం దిశ కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అయినట్టు తెలుస్తోంది. తమిళ స్టార్ సీనియర్ హీరో సూర్య సరసన నటించే చాన్స్ అందుకున్నట్టు సమాచారం. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో కొత్త సినిమాను అనౌన్స్ చేశారు రీసెంట్ గా. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈసినిమా ఈ మధ్యే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరుపుకుంది.
అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమాలో సూర్య సరసన హీరోయిన్గా దిశా పటాని నటిస్తుందని సమాచారం. మూవీ టీమ్ అయితే ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయ లేదు కాని.. సినిమా పూజా కార్యక్రమాల ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి దిశ పేరు కూడా ట్యాగ్ చేసింది. దాంతో, సూర్య సరసన దిశానే హీరోయిన్ గా నటిస్తోందని ఫిక్స్ అయిపోతున్నారు ఫ్యాన్స్.
అయితే ఈమూవీలో ముందుగా సూర్యకు జోడీగా పూజా హెగ్డే ను తీసుకోవాలి అనుకున్నారు టీమ్. దాదాపు పూజా రోల్ కన్ ఫార్మ్ చేసేశారు కాని ఎందుకో చివరకు దిశా పటానిని పేరును తెరపైకి తీసుకొచ్చారు. అయితే దీనికి ఓ చిన్న రీజన్ కూడా లేకపోలేదు. గతంలో ఓ యాడ్ లో సూర్యతో కలిసి నటించిన అనుభవం దిశాకు ఉంది. అదే ఇప్పుడు దిశను హీరోయిన్ గా తీసుకోవడానికి యూస్ అయ్యిందని టాక్.
దిశ పటానీ పాన్ ఇండియా స్టార్ గా మారాలని చూస్తోంది. అటు సినిమాలు ఇటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. క్లీవేజ్ షోతో.. గ్లామర్ ఫొటోలను ఫోస్ట్ చేస్తూ.. యూత్ లో కాకరేపుతోంది. ఇర సౌత్ లో ఆమె క్రేజ్ సాధించగలదో లేదో చూడాలి.