' నీ ఫిగర్ సైజెంత' అంటూ వల్గర్ గా ప్రవర్తించిన నెటిజన్.. దిశా పటాని కూల్ గా రిప్లై

First Published Nov 8, 2021, 3:49 PM IST

బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.

బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. దిశా పటాని వెండి తెరపైకూడా హీటెక్కించే నటి. సోషల్ మీడియాలో అయితే బికినీ పిక్స్, హాట్ ఫోటో షూట్స్ తో మిలియన్ల కొద్దీ అభిమానులని సొంతం చేసుకుంది. 

లోఫర్ చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన Disha Patani ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. లోఫర్ మూవీ నిరాశపరచడంతో దిశా మరో ఆలోచన లేకుండా బాలీవుడ్ లోకి వెళ్లిపోయింది. అక్కడ ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే గుర్తింపు సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడం దిశా పటానికి బాగా కలసి వచ్చింది. 

సెలబ్రిటీలకు సోషల్ మీడియా ఎంత బాగా ఉపయోగపడుతోందో అదే స్థాయిలో చిక్కులు కూడా తెచ్చిపెడుతుంది. ఇటీవల దిశా పటాని సోషల్ మీడియాలో అభిమానులతో లైవ్ చాట్ నిర్వహించింది. దిశా పటాని లాంటి క్రేజీ హీరోయిన్లు అభిమానులతో ఇంటరాక్ట్ కావాలని ప్రయత్నించిన ప్రతిసారి ఇబ్బందులు ఎదురొంటున్నారు. 

దిశా పటాని లైవ్ చాట్ నిర్వహిస్తున్న సమయంలో ఓ ఆకతాయి అభిమాని.. 'నే ఫిగర్ సైజు ఎంత' అంటూ వల్గర్ గా ప్రశ్నించాడు. కానీ దిశా మాత్రం సహనం కోల్పోకుండా కూల్ గా సమాధానం ఇచ్చింది. అతడి కామెంట్ కు ఓ పాండా ఫన్నీగా తిరుగుతున్న జిప్ ఇమేజ్ ని పోస్ట్ చేసింది. ఆ ఆకతాయి ప్రశ్నని దిశా పటాని పెద్దగా పట్టించుకోలేదు. 

ప్రస్తుతం దిశా పటాని ఏక్ విలన్ రిటర్న్స్ అనే చిత్రంలో నటిస్తోంది. ఇక దిశా పటాని క్రేజీ హీరో టైగర్ ష్రాఫ్ తో రిలేషన్ కొనసాగిస్తోంది. చాలా కాలంగా ఈ జంట ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. 

ఇక దిశా పాటని ఘాటు ఫోజులతో ఇంస్టాగ్రామ్ లో హాట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. మతిపోగొట్టేలా ఉండే ఆమె నాజూకు అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

click me!