సెలబ్రిటీల జాబితాలో దిశా కూడా..
ముంబైలోని లాభదాయకమైన అద్దె మార్కెట్ ద్వారా ఆదాయం పొందుతున్న బాలీవుడ్ సెలబ్రిటీల జాబితాలో దిశా కూడా చేరారు. అమితాబ్ బచ్చన్, కార్తీక్ ఆర్యన్, షాహిద్ కపూర్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్లు కూడా తమ నివాస, వాణిజ్య ఆస్తులను అద్దెకు ఇచ్చి వార్తల్లో నిలిచారు.
ఈ అపార్ట్మెంట్ రుస్తోమ్జీ గ్రూప్ నిర్మించిన లగ్జరీ ప్రాజెక్ట్ 'రుస్తోమ్జీ పారామౌంట్'లో ఉంది. ఈ ప్రాజెక్ట్లో ప్రీమియం 3BHK, 4BHK నివాసాలతో పాటు మినీ థియేటర్, స్పా, సెలూన్, బాంక్వెట్ హాల్, బిజినెస్ సెంటర్, స్కై లాంజ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
ఈ ప్రాపర్టీ చాలా ఏళ్లుగా పలువురు సెలబ్రిటీలను ఆకర్షిస్తోంది. 2021లో నటి రాణి ముఖర్జీ కూడా ఇదే కాంప్లెక్స్లో ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్కు బాలీవుడ్ ప్రముఖుల అడ్రస్గా మరింత పేరు వచ్చింది.