Rajamouli: దర్శకుడు వీర శంకర్ తన సినీ జీవితంలోని ఒడిదుడుకులను, రాజమౌళి 'ఛత్రపతి'కి ముందు ఎదుర్కొన్న సస్పెన్షన్, నానిపై డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడి, పునీత్ రాజ్ కుమార్తో తనకున్న అనుబంధం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
టాలీవుడ్ దర్శకుడు వీర శంకర్ ఒకప్పుడు ఇండస్ట్రీ నుంచి రాజమౌళి సస్పెన్షన్ దగ్గర నుంచి.. తనకు పునీత్ రాజ్ కుమార్తో ఉన్న బంధం వరకు ప్రతీ విషయాన్ని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే గౌరవం ఉంటుందని, ప్రతిభ ఉన్నవారు తమకు తామే అవకాశాలను సృష్టించుకోవాలని వీర శంకర్ అభిప్రాయపడ్డారు. దర్శకధీరుడు రాజమౌళి 'ఛత్రపతి' సినిమా చేయకముందు ఒక ఇష్యూ వల్ల రెండు మూడు నెలల పాటు సస్పెన్షన్కు గురయ్యారు. అప్పట్లో ఆయన్ను సస్పెండ్ చేయడంలో కీలక పాత్ర పోషించిన వారు ఇప్పుడు ఆయన పక్కనే ఉండటం గమనార్హం. కేవలం తన అద్భుతమైన సక్సెస్తోనే ఆయన అందరినీ తన వైపు తిప్పుకున్నారని వీర శంకర్ పేర్కొన్నారు.
25
నాని సాధించిన ఘనత:
నటుడు నాని 'టక్ జగదీష్' సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేసినప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఆయన్ను బ్యాన్ చేస్తామని హెచ్చరించారు. కానీ ఆయన నిర్మించిన 'దసరా'(కోర్టు ఇష్యూ ప్రస్తావన) వంటి సినిమాలు భారీ విజయం సాధించడంతో, నానిని విమర్శించిన వారే ఇప్పుడు పొగుడుతున్నారని, ఇది ఆయన సాధించిన విజయం అని చెప్పారు.
35
సొంత ఆస్తులు అమ్ముకున్న వైనం:
ఒక సినిమా ప్రొడక్షన్ మధ్యలో ఆగిపోయినప్పుడు, దానిపై ఆధారపడిన వారి కోసం వీర శంకర్ తన సొంత ఇల్లు, రెండు ఎకరాల పొలం అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో శాటిలైట్ బిజినెస్ పడిపోవడం వల్ల భారీ నష్టం వచ్చిందని, ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి కోలుకోవడానికి ఐదేళ్లు పట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ వీర శంకర్ని స్వయంగా కలిసి కన్నడలో సినిమా చేయమని కోరారట. పునీత్ వినయం, క్రమశిక్షణ తనను ఎంతో ఆకట్టుకున్నాయని, ఆయన అకాల మరణం తనకు తీరని లోటు అని వీర శంకర్ గుర్తుచేసుకున్నారు.
55
ఇద్దరు పవర్ స్టార్లతో పని చేయడం:
తెలుగులో పవన్ కళ్యాణ్తో 'గుడుంబా శంకర్', కన్నడలో పునీత్ రాజ్ కుమార్తో సినిమాలు చేయడం ఒక అరుదైన అనుభవమని ఆయన తెలిపారు. పునీత్ రాజ్ కుమార్ సిఫార్సుతోనే కన్నడలో మరిన్ని అవకాశాలు వచ్చాయని ఆయన వివరించారు.