అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ని ప్రారంభించిన వంశీ.. 1982లో `మంచు పల్లకీ` సినిమాతో దర్శకుడిగా మారారు. `సితార` చిత్రంతో తానేంటో నిరూపించుకున్నారు. ఈ చిత్రం జాతీయ అవార్డుని అందుకుంది. `అన్వేషణ`, `ప్రేమించు పెళ్లాడు`, `ఆలాపన`, `లేడీస్ టైలర్`, `మహర్షి`, `చెట్టు కింద ప్లీడర్`, `ఏప్రిల్ 1 విడుదల`, `డిటెక్టీవ్ నారద`, `జోకర్`, `ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు` వంటి చిత్రాలను రూపొందించారు.
హ్యూమర్, సెన్సిబులిటీస్ని ఆవిష్కరించడంలో ఆయన దిట్ట. టాలీవుడ్లో దర్శకుడిగా తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు వంశీ. చివరగా ఆయన `ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్` మూవీని రూపొందించారు. ఇది ఆడలేదు. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
read more: ఎన్టీఆర్, ఏఎన్నార్ల కంటే అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా? సావిత్రి, భానుమతి, జమున కాదు
also read: Mad Square Movie Review: `మ్యాడ్ 2` మూవీ రివ్యూ, రేటింగ్