భానుప్రియతో రెండో పెళ్లికి సిద్ధమైన దర్శకుడు వంశీ.. ఆపింది ఎవరు? తెరవెనుక ఏం జరిగిందంటే?

Aithagoni RajuUpdated : Apr 04 2024, 09:24 AM IST

సీనియర్‌ దర్శకుడు వంశీ.. అప్పటి స్టార్‌ హీరోయిన్‌ భానుప్రియని పెళ్లిచేసుకోవాలనుకున్నారు. అప్పటికే పెళ్లైన తను రెండో వివాహం చేసుకోవాలనుకున్నాడట. మరి ఎందుకు ఆగిపోయింది?

18
భానుప్రియతో రెండో పెళ్లికి సిద్ధమైన దర్శకుడు వంశీ.. ఆపింది ఎవరు? తెరవెనుక ఏం జరిగిందంటే?

భానుప్రియ ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌. అగ్ర హీరోలు చిరంజీవి, వెంకటేష్‌, బాలకృష్ణ, సుమన్‌ వంటి వారితో అనేక సినిమాలు చేసి మెప్పించింది. స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. నటిగా, క్లాసికల్‌ డాన్సర్‌గా ఆమెకి విశేష గుర్తింపు ఉంది. పైగా ఎక్కువగా ట్రెడిషనల్ రోల్స్ లో నటించి మెప్పించింది. తెలుగులో అద్భుతమైన చిత్రాలు చేసింది. క్లాసిక్స్ లో ఆమె భాగమైంది. దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు చిత్ర పరిశ్రమలో రాణించింది. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.
 

28

ఇటీవల భానుప్రియ సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తుంది. చాలా అరుదుగానే మెరుస్తున్నారని చెప్పొచ్చు. ఆమెకి ఆఫర్లు తక్కువ కావడమో, లేక తను సెలక్టీవ్‌గా ఉండటమోగానీ, ఏడాదికి ఒకటి అర మాత్రమే కనిపిస్తుంది భాను ప్రియ. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూ క్లిప్‌ యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. ఆమె చెప్పిన విషయాలు వైరల్‌గా మారుతున్నాయి. 

38

భానుప్రియ లవ్‌ స్టోరీ హాట్‌ టాపిక్‌ అవుతుంది. భానుప్రియా కమర్షియల్‌ సినిమాలు, డివోషనల్ మూవీస్‌ చేసింది. అందులో భాగంగా దర్శకుడు వంశీతో కలిసి చాలా సినిమాలే చేసింది. దీంతో దర్శకుడితో మంచి అనుబంధం, అది ప్రేమగా మారింది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వీరిద్దరి ప్రేమ అప్పట్లో పెద్ద సంచలనంగా మారిందట. పెద్ద డిస్కషన్‌ పాయింట్‌ అయ్యింది. 
 

48

దర్శకుడు వంశీకి ఆల్‌రెడీ పెళ్లైంది, పిల్లలు కూడా ఉన్నారు. అయినా భానుప్రియతో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. అంతేకాదు ఏకంగా భానుప్రియ పెద్ద వాళ్లతో మాట్లాడాడు. ఇంట్లో ఈ విషయాన్ని చెప్పింది భానుప్రియ. దీంతో పేరెంట్స్ ఒప్పుకోలేదట. ముఖ్యంగా భానుప్రియ అమ్మ మ్యారేజ్‌ చేసుకోవడానికి వీల్లేదని చెప్పింది. 

58

అంతేకాదు భానుప్రియని కట్టడి చేసిందట. అతనికి ఆల్‌రెడీ మ్యారేజ్‌ అయ్యింది. పిల్లలు ఉన్నారు. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడమేంటి అని మందలించిందట అమ్మా. ఏమాత్రం సహించలేదని చెప్పింది భానుప్రియా. అమ్మ కారణంగానే ఆ మ్యారేజ్‌ ఆలోచన విరమించుకున్నట్టు చెప్పింది భానుప్రియ. అమ్మ తనని అన్ని విషయాల్లో ప్రొటెక్ట్ చేస్తుందని వెల్లడించింది భానుప్రియ. అలా భానుప్రియతో దర్శకుడు వంశీ రెండో పెళ్లి వ్యవహారం క్లోజ్‌ అయ్యింది. 
 

68

 ఆ తర్వాత భానుప్రియ.. 1998లో డిజిటల్‌ గ్రాఫిక్ ఇంజనీర్ ఆదర్శ్‌ కౌశల్‌ని వివాహం చేసుకుంది. కాలిఫోర్నియాలో వీరి మ్యారేజ్‌ జరిగింది. వీరికి కూతురు అభినయ ఉంది. అయితే భానుప్రియ భర్త ఆదర్శ్‌ 2018లో గుండెపోటుతో మరణించారు. దీంతో ఆమె ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది. తన కూతురుతో కలిసి చెన్నైలో ఉంటున్నట్టు తెలుస్తుంది. 
 

78

భానుప్రియ నటించిన `సితార` విశేష ఆదరణ పొందింది. దీనికి దర్శకుడు వంశీ కావడం విశేషం. ఆ తర్వాత `అన్వేషణ`, `విజేత`, `దొంగమొగుడు`, `జేబుదొంగ`, `స్వర్ణకమలం`, `ఖైదీ నెం 786`, `స్టేట్‌ రౌడీ` వంటి వంటి వందల చిత్రాల్లో నటించింది. ఏఎన్నార్‌, కృష్ణ, చిరంజీవి, వెంకటేష్‌, బాలకృష్ణ, సుమన్‌, రాజేంద్రప్రసాద్‌ వంటి వారితో కలిసి నటించింది. స్టార్‌ హీరోయిన్‌గా వెలిగింది. 
 

88

పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యింది. మళ్లీ తిరిగి 2003లో అమెరికా నుండి తిరిగి వచ్చేసిన భానుప్రియ మళ్ళీ నటించడం మొదలుపెట్టారు. `గౌతమ్ ఎస్ ఎస్ సి`, `ఛత్రపతి`, `చినబాబు` తదితర చిత్రాల్లో తల్లి, వదిన పాత్రల్లో నటించారు. చివరగా ఆమె `మహానటి`, `నాట్యం` చిత్రాల్లో మెరిసింది. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!