ఇక రాజమౌళి ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమలోనే పనిచేశారు. స్క్రీన్ రైటర్ గా, ఫిల్మ్ మేకర్ గా, నిర్మాతగానూ సినిమాలు అందించారు. అడ్వెంచర్, ఫాంటసీ జానర్ సినిమాలకు ప్రసిద్ధి చెందాడు. చిత్ర పరిశ్రమలో ఆయన చేసిన విశేష కృషికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వరించాయి. 2016లో కేంద్ర ప్రభుత్వం రాజమౌళిని పద్మశ్రీతో సత్కరించింది.