బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజే మారిపోయింది. ఈ సినిమా తరువాత పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ వరుసగా అదే రేంజ్ సినిమాలు చేస్తున్నాడు. బాహుబలి తరువాత సాహో సినిమాతో మరో బిగ్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్. సాహో సెట్స్ మీద ఉండగానే జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమాను ప్రారంభించాడు ప్రభాస్. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే లాక్ డౌన్ ప్రకటించటంతో షూటింగ్ ఆగిపోయింది.
undefined
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇటలీలో షూటింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మన ఇక్కడ భారీ సెట్స్ నిర్మించి అందులో షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
undefined
ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు రాధాకృష్ణ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. `ప్రభాస్ను డైరెక్ట్ చేయటం నా డ్రీమ్, ఆయన తో వర్క్ చేయటం చాలా ఆనందంగా ఉంది.`
undefined
రాధేశ్యామ్ వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్కే బిగ్గెస్ట్ ఎసెట్. ఈ సినిమా కోసం మరే నటిని సంప్రదించలేదన్న రాధా కృష్ణ, పూజా హెగ్డేనే ఫస్ట్ చాయిస్ అని వెల్లడించాడు.
undefined
సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభించనున్నామని, మోషన్ పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ అన్ని రానున్నాయి ఓపిగ్గా ఉండండి అంటూ కామెంట్ చేశాడు దర్శకుడు రాధాకృష్ణ.
undefined