నేడు(ఆగస్ట్ 1) నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమా షూటింగ్లో బంద్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పెరుగుతున్న ప్రొడక్షన్ కాస్ట్, వేతనాలు, హీరోల భారీ పారితోషికాలు వంటి వాటి కారణంగా ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుందని, బడ్జెట్ మించిపోతుందని, థియేటర్లో రాబటి తగ్గిపోతుందని నిర్మాతలు వాపోతున్నారు. పైగా థియేటర్లోకి జనం రాకపోవడం, ఓటీటీలో సినిమాలు వెంటనే రిలీజ్ కావడం వల్ల థియేటర్కి వచ్చే ఆడియెన్స్ శాతం దారుణంగా పడిపోయింది. దీంతో కలెక్షన్లు పడిపోతున్నాయి. వరుసగా సినిమాలు పరాజయం చెందుతున్నాయి.