మణిరత్నం వల్ల నష్టాలు, సినిమాలు వద్దనుకుని వెళ్ళిపోదాం అనుకున్నాం.. అప్పుడే జూ.ఎన్టీఆర్ మ్యాజిక్

First Published Oct 4, 2024, 1:47 PM IST

డిస్ట్రిబ్యూటర్ గా తనకి ఎదురైన కష్టాల గురించి చెబుతూ దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక దశలో లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం డబ్బింగ్ చిత్రాలు తెలుగులో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారట.

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ఒకరు. మొదట దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ చిత్రం దిల్ రాజుకి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. డిస్ట్రిబ్యూటర్ గా గుర్తింపు తీసుకువచ్చింది. ఆ తర్వాత మరికొన్ని చిత్రాలు డిస్ట్రిబ్యూట్ చేశారు. 

డిస్ట్రిబ్యూటర్ గా తనకి ఎదురైన కష్టాల గురించి చెబుతూ దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక దశలో లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం డబ్బింగ్ చిత్రాలు తెలుగులో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారట. ఆ చిత్రాలు దారుణమైన రిజల్ట్ ఇచ్చాయి. దీనితో దిల్ రాజుకి నష్టాలు తప్పలేదు. వరుసగా నష్టాలు ఎదురవుతుండడంతో ఆఫీస్ మూసేసి సినిమా ఇండస్ట్రీ వద్దనుకుని వెళ్ళిపోదాం అని డిసైడ్ అయ్యారట. 

Latest Videos


ఆ టైంలో వివి వినాయక్ ఎన్టీఆర్ తో ఆది చిత్రం చేస్తున్నారు. ఒకసారి వినాయక్ ని కలిస్తే ఆ చిత్రంలో కొన్ని సీన్స్ చూపించారట. ఈ మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అని గ్రహించిన దిల్ రాజు ఆ చిత్ర డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్నారు. ఆది సూపర్ హిట్ కావడంతో దిల్ రాజుకి లాభాల పంట పండింది. మళ్ళీ దిల్ రాజు ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. 

NTR

ఆ వెంటనే వివి వినాయక్ కి అడ్వాన్స్ ఇచ్చి నితిన్ తో దిల్ చిత్రాన్ని నిర్మించారు. తాను నిర్మించిన మొదటి చిత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీనితో దిల్ రాజు నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. 

దిల్ రాజు ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర దర్శకులలో ఒకరు. దిల్ తర్వాత ఆర్య, భద్ర లాంటి సూపర్ హిట్స్ దక్కాయి. ప్రస్తుతం దిల్ రాజు పాన్ ఇండియా చిత్రాలు కూడా నిర్మిస్తున్నారు. 

click me!