సాటి హీరోలపై సెటైర్లు వేయడాన్ని కొందరు హీరోలు ఒప్పుకునే వారు కాదు. అందులో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ ఉన్నారు. ఎన్టీఆర్ తో పొలిటికల్ గా విభేదాలు వచ్చాక మాత్రం కృష్ణ ఆయనపై సెటైరికల్ మూవీస్ చేశారు. కానీ అంతకు ముందు సెటైరికల్ గా చిన్న డైలాగ్ ఉన్నా వద్దని చెప్పేవారట. ఎంఎస్ రెడ్డి, పరుచూరి బ్రదర్స్, సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఒక చిత్రం విషయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పరుచూరి బ్రదర్స్ ప్రమేయం లేకుండా ఎన్టీఆర్ పై సెటైర్ వేస్తూ డైలాగ్ పెట్టారు. ఈ విషయాన్ని పరుచూరి బ్రదర్స్ స్వయంగా తెలిపారు.