ఇడ్లీ బాబాయ్, భాగ్యం కలిసి హోటల్ రిసెప్షనిస్టు దగ్గరికి వెళ్తారు. ప్రేమ, ధీరజ్ పెళ్లి గురించి అడుగుతారు. అయితే రిసెప్షనిస్టు చెప్పేందుకు ఇష్టపడదు. దాంతో 30,000 రూపాయలు లంచం ఇచ్చి మరీ మొత్తం విషయం తెలుసుకుంటారు. కళ్యాణ్ అనేవాడు ప్రేమను తీసుకొచ్చాడని, అయితే లవ్ పేరుతో నమ్మించి వేరే వాళ్ళకి అమ్మేశాడని చెబుతుంది రిసెప్షనిస్ట్. ప్రేమను కాపాడేందుకు ధీరజ్, అతని తల్లి వచ్చి ఆమెను పెళ్లి చేసుకున్నారని వివరిస్తుంది. అప్పుడు భాగ్యం సిసి ఫుటేజ్ ఉంటే కావాలని అడుగుతుంది. అది కూడా ఇచ్చేస్తుంది రిసెప్షనిస్ట్. దీంతో భాగ్యం ఆనంద పడిపోతూ ఉంటుంది.
ఇక ఇక్కడి నుంచి సీన్ వల్లి దగ్గరికి మారుతుంది. వేదవతి.. ధీరజ్, ప్రేమలకు ఏం జరిగిందోనని కంగారుగా ఉంటే.. వల్లి మాత్రం ఆనందంగా ఉంటుంది. ఇక అమూల్యను కూల్ చేసేందుకు విశ్వ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈలోపు రామరాజు వచ్చి అన్నం వడ్డించమని అడుగుతాడు. వేదవతి ప్రేమ, ధీరజ్ అంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్లారని అడిగితే షాపింగ్ కి వెళ్ళారని చెబుతుంది. ఇంతలో ధీరజ్, ప్రేమ వస్తారు. పోలీసులు ఎందుకు పిలిచారని వేదవతి అడుగుతుంది. వేరే కేసు ఎంక్వయిరీ గురించి అని చెబుతాడు ధీరజ్. అది రామరాజు వినేస్తాడు. కేసు ఏంటని అడిగితే ట్రాఫిక్ పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్ అడుగుతున్నారని కవర్ చేస్తాడు ధీరజ్.