నయనతారకు మరో షాకిచ్చిన ధనుష్. శింబుకి ఫ్రీ, లేడీ సూపర్ స్టార్ కు మాత్రం 10 కోట్ల ఫైన్

Published : Jul 01, 2025, 06:32 PM IST

నయనతారకు మరోసారి పెద్ద షాక్ ఇచ్చాడు స్టార్ హీరో ధనుష్. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య జరుగుతున్న ఫైట్ గురించి అందరికి తెలిసిందే. ఈ విషయంలోనే ధనుష్ నయనతారకు కోపం వచ్చేలా ఓ పనిచేశారు. ఇంతకీ ఏం చేశాడంటే? 

PREV
15

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు ధనుష్. హీరోగా మాత్రమే కాదు దర్శకుడు, నిర్మాత, గాయకుడు, గేయ రచయితగా మల్టీ టాలెంట్ చూపిస్తూ.. ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ తో కొనసాగుతున్నారు. అంతే కాదు ధనుష్ తనతో పాటు ఎంతో మందికి ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చాడు. 

తన సినిమాల ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్, హీరో శివ కార్తికేయన్ వంటి ఎంతో మంది టాలెంట్ ఉన్నవారిని పరిచయం చేశారు ధనుష్. ఇక ప్రొడ్యూసర్ గా కూడా ధనుష్ ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించారు. ఆ జాబితాలో నానుమ్ రౌడీ ధాన్ కూడా ఒకటి.

25

విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ధనుష్ నిర్మించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటించారు. ఈ మూవీకి ముందు స్నేహితులుగా ఉన్న ధనుష్, నయనతార, ఈ చిత్రం తర్వాత విడిపోయారు. దానికి కారణం ఆ చిత్ర షూటింగ్ సమయంలో ఏర్పడిన మనస్పర్థలే. ఇచ్చిన బడ్జెట్ కంటే 10 కోట్లు ఎక్కువ ఖర్చు చేసినందుకు నయనతారపై ధనుష్ అసంతృప్తిగా ఉన్నారు. ఈ ఖర్చు వల్ల ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయినా ధనుష్ కు పెద్దగా లాభం రాలేదు.

35

ఇంతలో నటి నయనతార తన డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ ధాన్ పాటలను ఉపయోగించుకోవడానికి ధనుష్ ను అనుమతి కోరారు. ఎందుకంటే నానుమ్ రౌడీ ధాన్ చిత్రంలో నటించినప్పుడే విగ్నేష్ శివన్ - నయనతార మధ్య ప్రేమ చిగురించింది. ఆ చిత్రంలోని పాటలను నయనతారను దృష్టిలో పెట్టుకుని విగ్నేష్ శివన్ రాశారు. అందుకే ఆ పాటలను తన డాక్యుమెంటరీలో ఉపయోగించుకోవడానికి అనుమతి కోరారు నయన్. కానీ నటుడు ధనుష్ అనుమతి ఇవ్వలేదు.

45

దీంతో ఆ పాటలు లేకుండానే డాక్యుమెంటరీని విడుదల చేయాలని నిర్ణయించుకున్న నయనతార, నానుమ్ రౌడీ ధాన్ షూటింగ్ సెట్ లో తీసిన 3 సెకన్ల వీడియోను ఆ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. దాంతో ఈ వీడియోను తొలగించాలని నోటీసు పంపిన ధనుష్, తొలగించకపోతే తనకు 10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని హెచ్చరించారు. దీంతో వారిద్దరి మధ్య వివాదం ముదిరింది. దీంతో కోర్టును ఆశ్రయించిన ధనుష్, నయనతారపై కేసు వేశారు. ఆ కేసు విచారణలో ఉంది.

55

ఇలా నయనతారను 3 సెకన్ల వీడియో కోసం 10 కోట్లు అడిగిన ధనుష్, మరోసారి నయనతారకు బిగ్ షాక్ ఇచ్చాడు. రీసెంట్ గా వెట్రిమారన్ దర్శకత్వంలో వడ చెన్నై కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం కోసం నటుడు సింబుకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా దానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారు. దీన్ని చూసిన నెటిజన్లు నయనతారను ట్యాగ్ చేసి మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. 

ధనుష్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీ డియాలో ఓ ఆట ఆడేసుకుంటున్నారు. స్నేహితుల కోసం ధనుష్ ఏదైనా చేస్తారని అభిమానులు అంటున్నారు. ఈ NOC వివాదంలో ధనుష్, సింబు, నయనతారలను ఉద్దేశించి నెటిజన్లు పోస్ట్ చేస్తున్న మీమ్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories