గుడ్ న్యూస్.. మళ్లీ ఒక్కటవ్వబోతున్న ధనుష్ - ఐశ్వర్య.. సూపర్ స్టార్ ఇంట సందడి.!

First Published Oct 5, 2022, 5:56 PM IST

కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్ - ఐశ్వర్య రజినీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. భేదాభిప్రాయాలతో విడిపోయిన ఈ జంట మళ్లీ ఒక్కటవ్వబోతున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ ఇంట సందడి నెలకొంది.
 

కోలీవుడ్ స్టార్ కపుల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తమిళస్టార్ హీరో ధనుష్ (Dhanush) - ఐశ్వర్యా  రజినీకాంత్ (Aishwarya Rajinikanth). సరిగ్గా 9 నెలల కింద ఈ జంట అభిప్రాయ భేదాలతో విడిపోయిన విషయం తెలిసిందే.  వీరు డివోర్స్ పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు కూడా చాలా అప్సెట్ అయ్యారు.
 

ఈ ఏడాది ప్రారంభంలోనే ధనుష్, ఐశ్వర్య విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికన సుధీర్ఘమైన నోట్ ద్వారా ప్రకటించారు. అయితే వీరు ఏ కారణం  చేత విడిపోతున్నారనే విషయం ఎవ్వరికీ తెలియదు. సంవత్సరం కూడా గడవకముందే ఏమైందో ఏమోగానీ ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 

ఒకరంటే మరొకరికి అమితమైన ప్రేమాభిమానాలు ఉన్న ధనుష్ - ఐశ్వర్య మళ్లీ ఒక్కటవ్వబోతున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో గట్టగానే ప్రచారం జరుగుతోంది. ఇటీవలనే విడాకులను కూడా రద్దు చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రజనీకాంత్ ఇంట్లో ఇరు కుటుంబ సభ్యులు సమావేశమైనట్టు  సమాచారం. 
 

ఈ సందర్భంగా కుటుంబ పెద్దలు ధనుష్ - ఐశ్వర్య మధ్య గొడవను సద్దుమణిగించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ధనుష్ - ఐశ్వర్య కూడా తమ డివోర్స్ పిల్లల భవిష్యత్ పై ఎలాంటి ప్రభావం చూపకూడదని, ఇకపై కలిసే ఉండాలని నిర్ణయించుకున్నారంట. దీంతో రజనీకాంత్ కుటుంబీకులు,  ధనుష్ కుటుంబ సభ్యులు ఖుషీ అవుతున్నారంట. 
 

ఈ స్టార్ కపుల్ విడాకుల విషయం అప్పట్లో సంచలనంగా మారింది. విషయం తెలియగానే అభిమానులు, సినీ ప్రముఖులు కూడా వీరిద్దరూ మళ్లీ  ఒక్కటవ్వాలని  కూడా ఆకాంక్షించారు. ప్రస్తుతం వారి బలమైన కోరికే నిజం కాబోతోంది. ఈ మేరకు ధనుష్, ఐశ్వర్య కలుస్తారనే వార్త అభిమానులను సంతోష పెడుతోంది. 
 

ఐశ్వర్య - ధనుష్ విడిపోయినప్పటి నుంచి ఎవరి లైఫ్ లో వారు బిజీ అయ్యారు. ధనుష్ మాత్రం సినిమాల్లో ఫుల్ బిజీ అయ్యారు. మూడు నెలలకో సినిమాను రిలీజ్ చేస్తూ వచ్చారు. ఈ ఏడాది ‘మారన్’, ‘ది గ్రేట్ మ్యాన్’,‘తిరుచిత్రంబలం’తో అలరించారు. ‘నేను  వస్తున్నా’,‘వాతీ’,‘సార్’ చిత్రాలు రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం ‘కెప్టెన్ మిల్లర్’లో నటిస్తున్నారు. 
 

click me!