Guppedantha manasu: కొత్త పథకంతో దేవయాని, సాక్షి.. రిషిధారలను విడదీయడమే టార్గెట్?

First Published Sep 7, 2022, 12:28 PM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 6వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..  ఇంట్లో వాళ్ళు  అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు గౌతమ్, మహేంద్రలు, ఈరోజు వంటలు చాలా బాగున్నాయి అని అంటారు. అప్పుడు  దేవయాని, మనసు బాగుంటే రుచులు తెలుస్తాయి అని అంటుంది. ఇంతలో జగతి,రిషికి అన్నం వడ్డిస్తున్నప్పుడు,మీ చేతితో నాకు భోజనం పండించొద్దు అని రిషి అంటాడు. దాన్ని చూసి దేవయాని ఆనందపడుతుంది. ఇంతలో ధరణి దేవయాని, అత్తయ్య గారు అని పిలుస్తుంది. అప్పుడు ఇదంతా బ్రహ్మ అని అనుకుంటుంది.
 

 మీకు భోజనం వడ్డించినా అని అడగగా వడ్డించు అని అంటుంది.ఇంతలో జగతి రిషికి భోజనం వడ్డిస్తుంది. కానీ రిషి ఏమి అనడు. అప్పుడు దేవయాని, ఆ వసుధర వల్లే ఇదంతా జరుగుతుంది. ఎలాగైనా ఇద్దరి మధ్య దూరం పెంచాలి అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో వసూ తన పుస్తకాలు తో, పరీక్షలైపోయాయి అని నేను మిమ్మల్ని వదిలేయను, నేను జాగ్రత్తగా దాచుకుంటాను అని అంటుంది. ఇంతలో జగతి ఫోన్ చేస్తుంది.కంగారులో వసు హలో రిషి సార్ అని అంటుంది.
 

అప్పుడు జగతి నవ్వుకోని, నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు అమ్మ కానీ నేను చెప్పేది విను, ఇప్పటివరకు మీ ఇద్దరి మధ్య ఆటలు చాలు. నీ చదువు అని,పరీక్షలు అని, నీ వ్యక్తిగత జీవితానికి అడ్డు చెప్పావు. ఇప్పుడు పరీక్షలు అయిపోయాయి కదా అని అనేలోగా రిషీ, వసుకి ఫోన్ చేస్తాడు. అప్పుడు వసు, రిషి సార్ ఏంటి ఇప్పుడు చేస్తున్నారు.ఇప్పుడు మేడం ఫోన్ కట్ చేస్తే ఏమనుకుంటారు,పోని రిషి సార్ ఫోన్ ఎత్తకపోతే కొప్పడటారు అని అనుకుంటుంది. ఇంతలో జగతి, ఇప్పటికైనా నీ మనసులో విషయం చెప్పమ్మా అని అనగానే నేను రిషి సార్ తో మాట్లాడుతాను మేడం.
 

 మీరు ఏమనుకోకపోతే ఇందాకటి నుంచి సార్ ఫోన్ చేస్తున్నారు అని అనగా జగతి నవ్వుకొని సరే అయితే మాట్లాడుకో అని ఫోన్ పెట్టేస్తుంది.ఇప్పుడు నేను తిరిగి చేయనా? తిడతారా అని అనుకొని ఫోన్ చేస్తుంది వసు. ఫోన్ ఎత్తకుండా ఏం చేస్తున్నావు అని రిషి, వసుని అడగగా ఫోన్ కట్ చేయలేని వాళ్లతో మాట్లాడుతున్నాను సార్ అని అంటుంది. అప్పుడు రిషి మనసులో, జగతి మేడం ఫోన్ చేసినట్టున్నారు అని అనుకుంటాడు. ఏం చేస్తున్నావు అని రిషి అడగగా మా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాను అని అంటుంది.
 

 నేను కూడా ఇప్పుడే మీ చందమామ, చుక్కలు ఫ్రెండ్స్ తో మాట్లాడాను. అది కాదు వసుధార మా ఇంటికి రావచ్చు కదా, ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవచ్చు కదా! పద్ధతిగా మా ఇంటికి వచ్చేటట్టు పెద్దమ్మతో నేను మాట్లాడతాను.అలాగే ఒకసారి మీ ఊరికి కూడా వెళ్లాలి .నువ్వు చెప్పినా చింతపండు చెట్లు, పొలాలు మీ స్నేహితులు అందరిని నాకు చూడాలని ఉన్నది అని చెప్పి సరే అయితే తర్వాత చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడు వసూ ఆకాశంతో, చూసేవా చందమామz చుక్కలు రిషి సార్ నాతో బాగా మాట్లాడారు. ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను అని అంటుంది.
 

అప్పుడు రిషి, ఏంటి నేను ఒళ్ళు తెలీకుండా మాట్లాడేసాను. అయినా సరే చాలా రోజుల తర్వాత నా మనసులో మాటలు బయటకు వచ్చాయి అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో మహేంద్ర ఫ్రెండ్ కమలాకర్ అనే ఒక ఆయన తన కొడుకు పెళ్లి పత్రిక పట్టుకుని వచ్చాడు.అప్పుడు మహేంద్ర మన ఇంట్లో కూడా శుభకార్యం జరిగితే బాగుండు. మన పెళ్లిరోజు ఈ వారంలోనే ఉన్నది అని జగతి తో అనగా, మనము పెళ్లి రోజులు జరుపుకునే స్థితిలో లేము మహేంద్ర.మనం ఇన్ని రోజులు దూరంగా ఉన్నా సరే, మన ప్రేమ చెదిరిపోలేదు కానీ, ఇప్పుడు పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకునే సమయం కాదు అని జగతి అంటుంది.
 

అప్పుడు గౌతమ్ అక్కడికి వచ్చి అడగడం మర్చిపోయాను మీ పెళ్లి రోజు ఎప్పుడు అని అంటాడు. ఇప్పుడు ఆ విషయం ఎందుకులే అని మహేంద్ర అనగా,ఇందాక నేను మీ మాటలు విన్నాను అంకుల్. నేను విన్నది కరెక్ట్ అయితే ఈ వారంలోనే కదా మీ పెళ్లి రోజు అని చెప్పి ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్తాడు. ఈ మాటలన్నీ దేవయాని పైనుంచి వింటుంది. ఆ తర్వాత సీన్ లో  దేవయాని, వసు దగ్గరికి వెళ్తుంది. ఈవిడెందుకు రెస్టారెంట్ కి వచ్చారు అని వసు అనుకుంటుంది.
 

నువ్వు నాకు ఒక సహాయం చేయాలి వసుధార, నేను నా గతంలో ఎన్నో తప్పులు చేశాను. సాక్షి విషయంలో పొరపాటు చేశాను. ఇప్పటికైనా మా కుటుంబం అంతా కలిసి ఉండాలంటే నువ్వు నాకు సహాయం చేయాలి. జగతి మహీంద్రల పెళ్లిరోజు వారంలోనే ఉన్నది. కనుక నువ్వే దగ్గర ఉండి దానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేయాలి అని అంటుంది. అప్పుడు వసుకి అనుమానం వస్తుంది. అదే సమయంలో రిషి అక్కడికి వస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!