బాలకృష్ణ హీరోగా రూపొందిన `డాకు మహారాజ్` మూవీ సంక్రాంతి కనుకగా ఈ నెల 12న విడుదలైంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రగ్యా జైశ్వాల్, ఊర్వశీ రౌతేలా హీరోయిన్లుగా నటించారు. శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రలో నటించింది. బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. నాగవంశీ ఈ మూవీని నిర్మించిన విషయం తెలిసిందే.
ఆదివారం విడుదలైన ఈ చిత్రం భారీ కలెక్షన్ల దిశగా వెళ్తుంది. ఈ మూవీ ఆరు రోజుల్లో రూ. 124(75 కోట్ల షేర్) కోట్లు వసూలు చేసింది. భారీ వసూళ్ల దిశగా వెళ్తుంది. ఈ మూవీకి రూ.83కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ శని, ఆదివారంతో బ్రేక్ ఈవెన్ దాటుకుని లాభాల్లోకి వెళ్తుందని చెప్పొచ్చు.