30ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో కమెడియన్ పృథ్వీ టాలీవుడ్ లో పాపులర్ అయ్యారు. పలు చిత్రాల్లో ఆయన పోషించిన కామెడీ రోల్స్ బాగా నవ్వించాయి. 2019 ఎన్నికల సమయంలో పృథ్వీ వైసీపీ పార్టీలో చేరి పెద్ద హంగామానే చేసారు. ప్రచారం కోసం రాష్ట్రం మొత్తం తిరిగారు. ఫలితంగా సీఎం జగన్ పృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఆ తర్వాత మహిళతో ఫోన్ సంభాషణ లీక్ అయిన కారణంగా పృథ్వీ పదవి కోల్పోవడం, ఇబ్బందుల్లో చిక్కుకోవడం జరిగింది.