గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించిన హాస్య బ్రహ్మా

First Published Jun 27, 2020, 8:33 AM IST

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత ఫుల్‌ స్వింగ్‌లో సాగుతోంది. ఇప్పటికే పలువురు టీవీ స్టార్లు, యాంకర్‌లు, ఇతర సెలబ్రిటీలు ఈ చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటగా.. తాజాగా ఓ లెజెండరీ స్టార్‌ కూడా ఈ చాలెంజ్‌లో భాగస్వామి అయ్యాడు.

ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన హాస్య నటుడు బ్రహ్మానందం మొక్కలు నాటారు. శుక్రవారం మణికోండ లోని తన నివాసంలో మొక్కలు నాటిన బ్రహ్మానందం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడిన విషయాలను ఉదయభాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులకు వివరించారు.
undefined
తాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన బ్రహ్మానందం గారికి ఉదయభాను కృతజ్ఞతలు తెలిపారు. సృష్టిని కాపాడేందుకు ఒంటికాలిపై తపస్సు చేస్తుంది ఒక్క చెట్టు మాత్రమే అని. ఇది అక్షర సత్యం ప్రకృతి పట్ల తనకు ఉన్న బాధ్యతను బ్రహ్మానందం గారు నాతో పంచుకున్నారు అని చెప్పారు.
undefined
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు అని అందుకు సంతోష్ గారికి అభినందనలు తెలియజేశారు. ఆ ఫోటోలను చూస్తుంటే నేలతల్లి పై కూర్చొని తన తల్లికి సేవ చేస్తున్నట్లు కనిపిస్తుందని. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలామంది మొక్కలు నాటాలని ఆశిస్తున్నానని ఉదయభాను బ్రహ్మానందం తో చెప్పారు.
undefined
click me!