మోహన్ బాబుపై అలీ సంచలనం.. కన్నీరు మున్నీరైన మంచు లక్ష్మీ, అంత అవమానమా!

First Published Aug 15, 2021, 8:06 PM IST

కమెడియన్ అలీ మల్టీ ట్యాలెంటెడ్ నటుడు. నవ్వించడంతో పాటు కన్నీరు పెట్టించేలా ఎమోటినల్ గా మాట్లాడడం కూడా అలీకి తెలుసు. కమెడియన్ గా రాణిస్తూనే బుల్లితెరపై కొన్ని షోలలో హోస్ట్ గా చేస్తున్నాడు.

కమెడియన్ అలీ మల్టీ ట్యాలెంటెడ్ నటుడు. నవ్వించడంతో పాటు కన్నీరు పెట్టించేలా ఎమోటినల్ గా మాట్లాడడం కూడా అలీకి తెలుసు. కమెడియన్ గా రాణిస్తూనే బుల్లితెరపై కొన్ని షోలలో హోస్ట్ గా చేస్తున్నాడు. ప్రముఖ ఛానల్ లో డ్రామా జూనియర్స్ అనే ప్రోగ్రాంలో అలీ, సింగర్ సునీత జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. 

ఇండిపెండెన్స్ డే సందర్భంగా జరగబోయే ఎపిసోడ్ ప్రోమో వైరల్ గా మారింది. ఈ ఎపిసోడ్ కు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ లు పెర్ఫామ్ చేసిన స్కిట్ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించే విధంగా ఉంది. 

సినీ ఆర్టిస్ట్స్ కి, స్టేజి ఆర్టిస్ట్స్ కి తేడా తెలియజేస్తూ చేసిన స్కిట్ ఆకట్టుకుంటోంది. అదే విధంగా కరోనా కాలంలో ఆర్టిస్టుల కుటుంబాలు పడుతున్న కష్టాలని వివరించారు. ఆర్టిస్టుల కష్టాలు వింటుంటే ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లాయి. సింగర్ సునీత అయితే కంటతడి పెట్టుకున్నారు. 

ఈ స్కిట్ పూర్తయ్యాక అలీ మోహన్ బాబుని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ కి అక్కడే ఉన్న మంచు లక్ష్మీ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆర్టిస్టుల కష్టాలు ఎలా ఉంటాయో చెప్పేందుకు అలీ.. మోహన్ బాబు జీవితాన్ని ఉదాహరణగా తీసుకున్నారు. మోహన్ బాబు కెరీర్ ఆరంభంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో ఒక్క సంఘటన ద్వారా వివరించారు అలీ. 

మనకు తెలిసిన మంచు లక్ష్మి తండ్రి మోహన్ బాబు గారి అసలు పేరు భక్తవత్సలం నాయుడు. కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం వెతుకుతున్నప్పుడు.. మూడు నెలల నుంచి రూమ్ రెంట్ కట్టడం లేదని.. ఖాళీ చేయడం లేదని.. ఆ ఇంటి ఓనర్ తినే పళ్లెంలో మలం వేశాడట. 

అంతటి ఘోర అవమానాలు తట్టుకుని మోహన్ బాబు ఈ స్థాయికి ఎదిగారని అలీ చెప్పకనే చెప్పాడు. ఈ సంఘటన వింటున్నప్పుడు మంచు లక్ష్మీ కన్నీరు మున్నీరుగా విలపించింది. 

click me!