రాఘవేంద్ర రావు, కోడి రామకృష్ణ స్టైల్ కాదు.. వివి వినాయక్ స్టైల్.. 'విశ్వంభర' డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

First Published Jun 20, 2024, 7:12 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి అభిమానులైతే విశ్వంభర చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరిని మించేలా ఉండాలని కోరుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి అభిమానులైతే విశ్వంభర చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరిని మించేలా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ఈ మోడ్రన్ డేస్ లో జానపద చిత్రం తెరకెక్కించి ఆడియన్స్ ని మెప్పించడం అంత సులువైన విషయం కాదు. 

Vishwambhara

అది రాజమౌళికి మాత్రమే చెల్లింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ పీరియడ్ లో జానపద పౌరాణిక చిత్రాలు రాజ్యం ఎలాయి. ఆ తర్వాత రాఘవేంద్ర రావు, కోడి రామకృష్ణ లాంటి వారు అప్పుడప్పుడూ ప్రయత్నించారు. కానీ యువ దర్శకుడు వశిష్ట.. నందమూరి కళ్యాణ్ రామ్ తో బింబిసార చిత్రం తెరకెక్కించి అందరిని సర్ప్రైజ్ చేశాడు. ఆ మూవీ కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 

Latest Videos


ఇప్పుడు వసిష్ఠ మెగాస్టార్ చిరంజీవితో సోసియో ఫాంటసీ చిత్రాన్ని 200 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు. దీనితో మెగా ఫ్యాన్స్ అంతా జగదేక వీరుడు అతిలోక సుందరి రేంజ్ లో ఊహించుకుంటున్నారు. అయితే వసిష్ఠ మాత్రం ఊహించని షాక్ ఇచ్చారు. 

ఆ మధ్యన ఇంటర్వ్యూలో విశ్వంభర చిత్రం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోసియో ఫాంటసీ చిత్రం కావడంతో ఈ మూవీ రాఘవేంద్ర రావు, కోడి రామకృష్ణ లాంటి దర్శకుల స్టైల్ లో ఉంటుందా అని యాంకర్ ప్రశ్నించారు. వాళ్ళ ప్రభావం మీపై ఎంత ఉందని అడిగారు. దీనికి వసిష్ఠ సమాధానం ఇస్తూ తనపై ఏ దర్శకుడి ప్రభావం లేదని అన్నారు. 

నా స్టైల్ నేనే ఫాలో అవుతా.. నేను రాసుకున్న కథ ప్రకారం నా రూల్స్ నేనే ఫాలో అవుతా అని అన్నారు. ఒక వేళ నాపై ఏ దర్శకుడి ప్రభావం అయినా ఉంటే అది వివి వినాయక్ గారు మాత్రమే అని వసిష్ఠ షాక్ ఇచ్చారు. ఆయనతో నేను చాలా కాలం ట్రావెల్ చేశాను. ఆయన కథని వివరించే విధానం నాకు చాలా ఇష్టం. కథ విషయంలో పక్కా క్లారిటీతో ఉంటారు అని వసిష్ఠ తెలిపారు. 

ఇక విశ్వంభర చిత్రం రాజుల కాలం నాటి గెటప్పులు.. కొత్త గెటప్పులు ఉండవు. చిరంజీవి గారిని ఫాన్స్ ఎలా చూడడానికి ఇష్టపడతారో ఆయన అలాగే కనిపిస్తారు అని వసిష్ఠ తెలిపారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. లోక కళ్యాణం కోసం విశ్వంలో జరిగే ఒక అద్భుతాన్ని సాధించే వీరుడిగా చిరంజీవి కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సామాన్య వ్యక్తిగా కనిపించే చిరు అంత పెద్ద కార్యాన్ని ఎలా సాధించారు అనేది ఈ చిత్ర కథ అని సమాచారం. 

click me!