తాజాగా ఈ ప్రశ్న చిరంజీవికి ఎదురైంది. దీనిపై ఆయన స్పందించారు. ఇన్నాళ్లు దీనిపై స్పందించని ఆయన ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు. ఈ విషయం తన వరకు వచ్చిందని చెప్పారు. అయితే ఆ ప్రాపర్టీ తనది కాదని, అది తన మామయ్య(అమ్మ వాళ్ల తమ్ముడు)ది అని చెప్పారు. వాళ్ల ప్రాపర్టీపై తనకు ఎందుకు హక్కు ఉంటుంది, అది తనది ఎందుకు అవుతుందని ప్రశ్నించారు. ఇలాంటి వార్తలు, ఇలాంటి ప్రచారం ఎందుకు చేస్తారో అర్థం కాదు, బూరదజల్లే ప్రయత్నమే కాని, ఇది మరోటి కాదన్నారు చిరంజీవి. అది తన మామయ్యది కావడంతో ఆయన అమ్ముకున్నారని, దానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొందరు కావాలనే ఈ ప్రచారం చేశారని తెలిపారు. అయితే దీని వల్లే ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో చాలా బ్యాడ్ అయ్యిందట. పార్టీపై ప్రభావం చూపించిందట.