చిరంజీవి నటించిన ఓ ఇండస్ట్రీ హిట్ మూవీ గురించి సీనియర్ నటుడు జివి నారాయణ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణం రాజు ప్రారంభించిన సినిమా చివరికి చిరంజీవి చేతుల్లోకి వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ఖైదీ చిత్రంతో మలుపు తిరిగింది. ఆ తర్వాత చిరంజీవి ఇండస్ట్రీ హిట్ల మీద ఇండస్ట్రీ హిట్లు కొడుతూ టాలీవుడ్ లో మెగాస్టార్ గా ఎదిగారు. అప్పట్లో చిరంజీవి, కోదండ రామిరెడ్డి కాంబినేషన్ అంటే సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ. ప్రముఖ నటుడు, నిర్మాత జివి నారాయణ రావు ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
25
సీనియర్ నటుడు జివి నారాయణ రావు
చిరంజీవి, నారాయణ రావు మధ్య మంచి స్నేహం ఉండేది. ఆయన మాట్లాడుతూ నా పెళ్లి, చిరంజీవి పెళ్లి, రాజేంద్ర ప్రసాద్ గారి పెళ్లి దాదాపుగా ఒకే సమయంలో జరిగింది. మా ముగ్గురికి తొలి సంతానం కూడా ఒకే నెలలో కలిగింది అని నారాయణ రావు అన్నారు.
35
చిరంజీవి పసివాడి ప్రాణం మూవీ
చిరంజీవి పసివాడి ప్రాణం మూవీ విషయంలో జరిగిన సంఘటనని నారాయణ రావు గుర్తు చేసుకున్నారు. అది మలయాళీ సినిమా. నేను రీమేక్ హక్కులు కొన్నాను. చిరంజీవి గారికి ఆ సినిమా చూపించాను. ఆయన చేస్తే బావుంటుంది అనేది నా అభిప్రాయం. కానీ అది థ్రిల్లర్ సినిమా కావడంతో పాటలు లేవు. పాటలు లేకుంటే నా సినిమాని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అనే సందేహం చిరంజీవికి కలిగింది.
చిరంజీవి ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపలేదు. చక్రవర్తి మూవీ షూటింగ్ కోసం బాంబే వెళ్లిపోయారు. ఇంతలో ఇదే చిత్రాన్ని నాకు తెలియకుండా కృష్ణంరాజు హీరోగా కోదండరామిరెడ్డి ప్రారంభించారు. నా దగ్గర రీమేక్ హక్కులు ఉన్నప్పుడు వాళ్ళు అలా చేయకూడదు. నేను వెంటనే అల్లు అరవింద్ గారికి ఫోన్ చేశాను. ఈ సినిమా గురించి చెప్పాను.
55
ఇండస్ట్రీ హిట్
చిరంజీవి గారికి ఆ మూవీపై ఆసక్తి లేదు. ఇక ఎవరు చేస్తే ఏంటి అని అరవింద్ అన్నారు. లేదు ఈ సినిమా చిరంజీవి గారు చేయాల్సిందే అని పట్టుపట్టా. దీనితో అరవింద్ గారు.. అంతే అంటారా.. అయితే చూద్దాం.. వచ్చి మాట్లాడడం అన్నారు. ఆ విధంగా కృష్ణం రాజు సినిమాని ఆపేసి కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా పసివాడి ప్రాణం మూవీ ప్రారంభించాం. ఒరిజినల్ లో ఒక్క సాంగ్ లేదు. కానీ ఇందులో 6 పాటలు ఉంటాయి. ఆ విధంగా పసివాడి ప్రాణం చిత్రాన్ని కమర్షియల్ మూవీ గా మార్చాం. ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా రికార్డులు క్రియేట్ చేసింది అని జివి నారాయణ రావు అన్నారు.