అమ్మకు ప్రేమతో.. చెఫ్‌గా మారిన మెగాస్టార్‌.. వీడియో వైరల్‌!

First Published Aug 10, 2020, 12:31 PM IST

కరోన కారణంగా నాలుగు నెలలుగా సినిమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఆగిపోయాయి. షూటింగ్‌లు రిలీజ్‌లతో పాటు ప్రీ ప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్ చేసే పరిస్థితి కూడా లేకపోవటంతో సినీ తారలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడు షూటింగ్‌లు, ప్రయాణాలతో బిజీగా ఉండే స్టార్స్‌కు ఇలా ఖాళీ సమయం దొరకటంతో ఆ టైంను ఫ్యామిలీ కోసం స్పెండ్ చేస్తున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి కూడా అందుకు తాను అతీతంగా కాదని చూపిస్తున్నాడు. అందరికంటే ముందే తన సినిమా ఆచార్య షూటింగ్‌ను నిలివివేశాడు మెగాస్టార్‌. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీ టైంను ఎంజాయ్ చేస్తున్నాడు. అభిమానుల్లో కరోనాపై అవగాహన కల్పించటంతో పాటు తల్లి అంజనాదేవి, మనవారాళ్లతో సరదాగా టైం పాస్ చేస్తున్నాడు.
undefined
తాను కూడా సాధారణ వ్యక్తిలా ఇంటి పని చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు మెగాస్టార్‌. లాక్‌ డౌన్ సమయంలోనే సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన చిరు, తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు. తన డెయిలీ యాక్టివిటీస్‌ను కూడా అభిమానులతో పంచుకుంటూ ఇన్పిపిరేషన్‌గా నిలుస్తున్నాడు.
undefined
అంతేకాదు గతంలో ఓ ఛాలెంజ్‌లో భాగంగా ఇంటి పని చేయటంతో పాటు తల్లి అంజనా దేవి దోశ వేసి ఇచ్చాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ మారింది. తాజాగా మరో సారి అమ్మకోసం చెఫ్‌గా మారాడు మెగాస్టార్‌.
undefined
చిన్నతనంలో తన కోసం తల్లి చేసిన చేపలు కూరను ఇప్పుడు తల్లి కోసం తానే స్వయంగా వండి పెట్టాడు మెగాస్టార్‌. అంతేకాదు ఆ వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. నాలుగున్న నిమిషాల ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేశాడు మెగాస్టార్‌.
undefined
చిరు షేర్ చేసిన చేపల కూర వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో పోస్ట్ చేసిన రెండు గంటల్లోనే 2 లక్షలకు పైగా లైక్స్ రావటం విశేషం.చిరంజీవి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌:https:www.instagram.comtvCDshKfODBsx?utm_source=ig_web_copy_link
undefined
click me!