షూటింగ్ వరకూ వచ్చి ఆగిపోయింది
రెండో సినిమా విషయానికి వస్తే, ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఈ ఇద్దరు స్టార్స్తో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ చేశాడు. దీనికోసం కథను సిద్ధం చేసి, ఇద్దరికీ వినిపించాడు. చిరంజీవి , నాగార్జున ఇద్దరికి కథ నచ్చడంతో, సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. అంతే కాదు ఇంకాస్త ముందడుగు వేసి హీరోయిన్ గా హీరోయిన్ సౌందర్యను కూడా ఎంపిక చేశారు. షూటింగ్ స్టార్ట్ అయ్యింది, దాదాపు 10 శాతం వరకూ పూర్తయ్యిందట.