చిరంజీవి సినిమా టికెట్‌ ధర 800.. ముప్పై ఏళ్ల క్రితం మెగాస్టార్‌ రేంజ్‌ తెలిస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

First Published Feb 10, 2024, 8:15 AM IST

మెగాస్టార్‌ చిరంజీవి ఇరవై ఏళ్ల క్రితం టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ స్టార్‌. కాస్త ముందుకెళ్తే  అత్యధిక పారితోషికం అందుకున్న ఇండియన్‌ స్టార్‌గా నిలిచారు. అప్పట్లో ఆయన సినిమాల రేంజ్‌ తెలిపే ఓ పేపర్‌ క్లిప్పు వైరల్‌ అవుతుంది. 
 

 చిరంజీవి స్వయంకృషితో ఎదిగిన హీరో. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా తనని తాను నటుడిగా మలుచుకుంటూ రాణించాడు. వెండితెరపై తన నటన, డాన్సులు, ఫైట్లతో మ్యాజిక్‌ చేస్తూ కమర్షియల్‌ హీరోగా ఎదిగాడు. తెలుగు సినిమాని కమర్షియల్‌ బాట పట్టించాడు. సుప్రీం స్టార్‌ నుంచి సూపర్‌ స్టార్‌, అట్నుంచి మెగాస్టార్‌ గా ఎదిగారు. గత మూడు దశాబ్దాలుగా తెలుగు సినిమా శాషిస్తున్నాడు. ఇప్పుడు తర్వాత తరం హీరోలు పాన్‌ ఇండియా బాటలో దూసుకుపోతున్నా, తన క్రేజ్‌, తన రేంజ్‌ మాత్రం తగ్గలేదని నిరూపించుకుంటున్నారు. 

అయితే చిరంజీవి క్రేజ్‌ ముప్పై ఏళ్ల క్రితం మరింత పీక్‌లో ఉంది. అప్పట్లో ఆయనే టాలీవుడ్‌లో బిగ్‌ స్టార్‌గా రాణించారు. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ అలాగే కృష్ణ వంటి హీరోలున్నా చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్‌ మామూలు కాదు. 90ఫ్యాన్స్ లెక్క వేరే లెవల్‌. ఆ అభిమానాన్ని చూపించారు. అయితే అప్పట్లో చిరంజీవి నటించిన సినిమా టికెట్‌ ధర ఏకంగా 800 పలకడం విశేషం. అది ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అంతేకాదే చివరికి విషయం తెలిసి మెగాస్టార్‌ కూడా సర్‌ప్రైజ్‌ కావడం విశేషం. 
 

Latest Videos


ఆ వివరాల్లోకి వెళితే.. `ముఠామేస్త్రీ` మూవీ రిలీజ్‌ అయిన రోజు. 1993 జనవరి 17న ఈ మూవీ రిలీజ్‌ అయ్యింది. పాజిటివ్‌ టాక్‌తో రన్‌ అయ్యింది. రోజు రోజుకి సినిమాకి క్రేజ్‌ పెరిగింది. అయితే అప్పట్లో చిరంజీవికి హార్డ్ కోర్‌ ఫ్యాన్స్ బాగా ఉండేవారు. ఓ అభిమాని చిరంజీవిపై అభిమానాన్ని చూపించాడు. ఒక్క టికెట్‌ ఏకంగా 800లకు కొనుగోలు చేసి సినిమా చూశాడు. అప్పట్లో ఆ రేట్‌ అంటే ఇప్పుడు ఈజీగా ఎనభై వేలుగా చెప్పొచ్చు. దీనికి సంబంధించిన ఓ పేపర్‌ క్లిప్పు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 
 

`ముఠామేస్త్రీ` థియేటర్లో బాగా ఆడుతుంది. ఆ సమయంలో రాజమండ్రిలో కొందరు అభిమానులు సరదాగా వేలం పాట వేసుకున్నారట. ఇందులో ఓ అభిమాని 800లకు టికెట్ ని దక్కించుకున్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఓ పత్రిక దాన్ని వార్తగా ప్రచురించింది. అయితే ఆ విషయాన్ని బాబుమోహన్‌కి తెలియడంతో చిరంజీవికి చెప్పారట. అది విన్న మెగాస్టార్ ఆశ్చర్యపోయారట. ఆ అభిమాని ఎవరో కన్నుక్కొమని చెప్పగా, వివరాలు తెలియరాలేదని చెప్పారట. కానీ ఈ సంఘటన చూసి మెగాస్టార్‌ మురిసిపోయారని టాక్‌. 
 

ఇక కోదండరామిరెడ్డి రూపొందించిన ఈ మూవీలో చిరంజీవికి జోడీగా మీనా, రోజా నటించారు. రాజ్‌ కోటి సంగీతం అందించారు. కేసీ శేఖర్‌ బాబు, డీ శివ ప్రసాద్‌రెడ్డి నిర్మించారు. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఇది ఒక మార్కెట్‌ బేస్డ్ గా సాగే కథ. ఆ మార్కెట్‌లో ముఠాలకు మేస్త్రీగా పనిచేస్తుంటాడు చిరు. వారి హక్కుల కోసం పోరాడతాడు. అయితే వారికి వ్యతిరేకంగా, ఆ మార్కెట్‌ని తన వశం చేసుకోవాలని విలన్‌ ప్రయత్నిస్తుంటాడు. దీంతో సీఎం కోరిక మేరకు చిరు రాజకీయాల్లోకి వస్తాడు. మంత్రి అయి విలన్ల అంతు చూడటం ఈ మూవీ కథ. 
 

ఇక ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీగా ఈ మూవీ రూపొందుతుంది. వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌. ప్రస్తుతం ఇది చిత్రీకరణలో ఉంది. వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. 

click me!