చిరంజీవి తల్లి అంజనా దేవి ఓ నవల చదివారు. ఆ నవలని సినిమాగా చేయాలని చిరంజీవితో నిర్మాతలు చర్చలు జరుపుతున్నప్పుడు ఇది తప్పకుండా సూపర్ హిట్ అని అంజనా దేవి అన్నారట. ఆ సినిమా ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరో కాకముందు కూడా న్యాయం కావాలి, అభిలాష లాంటి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఆ టైంలోనే టాలీవుడ్ లో కొత్త స్టార్ ఎదుగుతున్నాడు అని అంతా భావించారు. ఖైదీతో అది కన్ఫర్మ్ అయింది. అభిలాష మూవీ విశేషాలని నిర్మాత కేఎస్ రామారావు ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.
25
అభిలాష నవల
ప్రాణం ఖరీదు సినిమా టైం నుంచే చిరంజీవి గురించి నాకు తెలుసు. చాలా బాగా చేస్తున్నాడు కొత్త కుర్రాడు అని అంతా అంటుండేవారు. ఆ టైంలో యండమూరి వీరేంద్రనాథ్ రచించిన అభిలాష అనే నవల ప్రచురించబడింది. ఆ నవల చాలా బావుంది అని అనిపించింది. చిరంజీవి ఒక రోజు షూటింగ్ లో ఉంటే వెళ్లి డిస్కస్ చేశాం. ఆయనకి కూడా నచ్చింది. కానీ కన్ఫర్మ్ చేయలేదు. రేపు మళ్ళీ మీట్ అయి చర్చిద్దాం అని అన్నారు.
35
సూపర్ హిట్ అని చెప్పిన చిరంజీవి తల్లి
దీనితో నెక్స్ట్ డే చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాను. ఆసక్తికర విషయం ఏంటంటే చిరంజీవి తల్లి అంజనాదేవి అప్పటికే అభిలాష నవల చదివేశారట. ఇందులో హీరో పేరు కూడా చిరంజీవే. నీకు చాలా బావుంటుంది, తప్పకండా హిట్ అవుతుంది అని ఆమె చిరంజీవికి చెప్పారు. ఆ విషయాన్ని చిరంజీవి నాతో షేర్ చేశారు. తన తల్లి ఎంకరేజ్ చేయడంతో చిరంజీవి అభిలాష చిత్రానికి వెంటనే ఒప్పుకున్నారు.
దర్శకుడిగా కోదండరామిరెడ్డి గారిని ఫిక్స్ చేశాం. అప్పటికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయరాజా పేరు తమిళనాడులో మారుమోగుతోంది. ఎలాగైనా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండాలి అని అనుకున్నాం. కథ చెబితే వెంటనే ఒప్పుకున్నారు. ఆ విధంగా మంచి కాంబినేషన్ కుదిరింది.
55
చిరంజీవి బాడీ ఏంటి అలా ఉంది
ఖర్చుకు వెనుకాడకుండా వివిధ లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. కొన్నిసార్లు రాజస్థాన్ లో బస్సు ప్రయాణం చేయాల్సి వచ్చేది. చిరంజీవి ఫ్యామిలీ, చిత్ర యూనిట్ అంతా బస్సుల్లో ట్రావెల్ చేశాం. అంతా అనుకున్నట్లే జరిగింది సినిమా రిలీజై సూపర్ హిట్ అయింది. కథతో పాటు చిరంజీవి డ్యాన్సుల గురించి కూడా జనాలు ప్రత్యేకంగా మాట్లాడుకోవడం ప్రారంభించింది ఈ సినిమాతోనే. చిరంజీవి యురేకా సకామిక సాంగ్ లో డ్యాన్స్ చేస్తుంటే ఈయన బాడీ ఏంటి ఇంత ఫ్లెక్సిబుల్ గా ఉంది. బాడీలో స్ప్రింగులు ఉన్నాయా అంటూ జనాలు మాట్లాడుకోవడం ప్రారంభించారు. అంతలా చిరంజీవి డ్యాన్సులతో మెస్మరైజ్ చేశారు అని కేఎస్ రామారావు తెలిపారు.