`చట్టంతో పోరాటం` చిరంజీవికి 75వ సినిమా కావడం విశేషం. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. యాక్షన్ ప్రధానంగానే వచ్చిన ఈ మూవీకి కె బాపయ్య దర్శకత్వం వహించారు. కె దేవీ వరప్రసాద్ నిర్మించారు.
ఇందులో చిరంజీవి సరసన మాధవి, సుమలత నటించగా, రావు గోపాలరావు నెగటివ్రోల్ చేశారు. కె చక్రవర్తి సంగీతం అందించారు.ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఏమాత్రం సత్తా చాటలేకపోయింది.
కానీ ఇదే ఏడాది `దొంగ`తో హిట్ని అందుకున్నారు. `చిరంజీవి`, `జ్వాలా`, `పులి`, `రక్తసింధూరం`, `అడవిదొంగ`, `విజేత` చిత్రాలు చేశారు. వీటిలో `అడవి దొంగ`, `విజేత` మంచి హిట్లుగా నిలిచాయి.
చిరంజీవికి రిలీఫ్నిచ్చాయి. ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర`, `మెగా 157` చిత్రాలతో బిజీగా ఉన్నారు.