రామ్ చరణ్ `ఆర్ఆర్ఆర్` తర్వాత `ఆచార్య` చిత్రంలో మెరిశారు. చిరంజీవి హీరోగా రూపొందిన ఈ మూవీ ఆడలేదు. ప్రస్తుతం ఆయన `గేమ్ ఛేంజర్` చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుంది.
ఇందులో చెర్రీకి జోడీగా కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. శ్రీకాంత్, ఎస్ జే సూర్య, అంజలి, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. దిల్ రాజు సుమారు 350కోట్ల బడ్జెట్తో దీన్ని తెరకెక్కిస్తుండటం విశేషం.