బాలకృష్ణ పరిశ్రమలో అడుగుపెట్టి 50 ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా టాలీవుడ్ పెద్దలు స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు హాజరు కావాలని చిరంజీవిని మా అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఆహ్వానించారు. కాబట్టి చిరంజీవి-బాలకృష్ణ ఒకే వేదిక పంచుకోనున్నారు. బాలయ్య సినీ ప్రస్థానాన్ని కొనియాడుతూ చిరంజీవి ప్రసంగించాల్సి ఉంది.