భర్త పీటర్ హాగ్తో విడాకుల గొడవ నడుస్తున్న టైంలో, నటి సెలీనా జైట్లీ ఆస్ట్రియా నుంచి ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. తన పిల్లల్ని కలవకుండా అడ్డుకున్నారని, అందుకే చనిపోయిన తన కొడుకు షంషేర్ సమాధిని మాత్రమే చూడగలిగానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
మాజీ బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ, తన భర్త పీటర్ హాగ్తో విడాకుల విషయంలో ఎదుర్కొంటున్న కష్టాల గురించి చెబుతూ ఆస్ట్రియా నుంచి ఒక ఎమోషనల్ వీడియో పంచుకుంది. కోర్టు విచారణ కోసం ఆస్ట్రియా వెళ్లినా, తన పిల్లలను కలవలేకపోయానని ఆమె ఆరోపించింది. చివరికి, చనిపోయిన తన కొడుకు షంషేర్ సమాధిని మాత్రమే చూడగలిగానని ఆమె చెప్పింది.
23
ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ నోట్
మే 6న సెలీనా జైట్లీ ఇన్స్టాగ్రామ్లో ఒక హృదయవిదారకమైన వీడియో, ఎమోషనల్ నోట్ పోస్ట్ చేసింది. గడిచిన కొన్ని వారాలు తన జీవితంలో అత్యంత దారుణమైనవని ఆమె అందులో పేర్కొంది. ఆస్ట్రియా జడ్జి ముందు హామీ ఇచ్చినప్పటికీ, తన పిల్లలను రహస్య ప్రదేశానికి తరలించారని, తాను ఆస్ట్రియాలో విచారణకు ఉన్నన్ని రోజులు వారిని ఇంటికి తీసుకురాలేదని సెలీనా ఆరోపించింది.
33
పిల్లలపై చెడు ప్రభావం
ప్రస్తుత పరిస్థితి తన పిల్లలపై చెడు ప్రభావం చూపుతుందేమోనని సెలీనా జైట్లీ భయం వ్యక్తం చేసింది. ఆస్ట్రియాలో గడిపిన సమయం చాలా బాధాకరం అని, తన పెళ్లి కోసం ఎన్నో త్యాగాలు చేశానని ఆమె ఆవేదన చెందింది. ఆమె ఎమోషనల్ పోస్ట్ చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ధైర్యంగా ఉండాలంటూ మెసేజ్లు పెడుతున్నారు.