మహా కుంభమేళలో తాను దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. ‘నిజంగా ప్రయాగ్ రాజ్ నన్ను పిలిచినట్లు అనిపిస్తుంది. మొదట్లో నాకున్న వర్క్ బిజీ వల్ల ఇక్కడకు రావడానికి కుదరదేమోనని అనుకున్నాను. కానీ సడెన్గా ఏమైందో ఏమోకానీ నా పనుల్లన్నింటిని పక్కన పెట్టి వెంటనే టికెట్ బుక్ చేసుకున్నాను. దీనికి ప్రధాన కారణం మా నాన్న. చివరి నిమిషంలో మనం కుంభమేళాకి వెళుతున్నామంటూ డాడీ నాకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇది నిజంగా మన జీవితంలో ఒకసారి జరిగేది, వచ్చేది కాబట్టి ఎలాంటి ప్రశ్నలు, సందేహాలు అడగకుండా నాన్నకు ఓకే చెప్పేశాను. ఇక్కడి ఒక్కొక్క అనుభవం, జీవితాంతం జ్ఞాపకం’ అనే క్యాప్షన్ను రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.