అలాంటి సమయంలో రుద్రాణి వచ్చి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఎలాగూ బతకని వ్యక్తికి ట్రీట్మెంట్ పేరుతో ఆస్తి మొత్తం ఖర్చు చేస్తారా అని ప్రశ్నిస్తుంది. నిజంగా, నాన్న బతికేవాడే అయితే, ఇప్పటికే పెద్ద అన్నయ్య, రాజ్ ఏదో ఒకటి చేసేవారు కదా అంటుంది. ఆ మాత్రం కోసం ఆస్తి మొత్తం కరిగిస్తారా అంటుంది. ఆ మాటకు చిట్టి కి కోపం నషాలానికి ఎక్కుతుంది. వెంటనే రుద్రాణి చెంప పగలకొడుతుంది. ఈ సీన్ చూసి రాహుల్ తప్ప, అందరూ సంతోషిస్తారు.
ఇక, బాధలో ఉన్న చిట్టిని రాజ్ సముదాయిస్తాడు. తాతయ్య ట్రీట్మెంట్ కోసం తాను చాలా మంది డాక్టర్లతో మాట్లాడానని చెబుతాడు. ఇప్పటి వరకు ఇంట్లో వాళ్లకు తెలీదు కాబట్టి, సీక్రెట్ గా అన్ని పనులు చేశానని, ఇప్పుడు అందరికీ తెలిసేలా అన్ని చర్యలు తీసుకుంటామని చెబుతాడు. అమెరికాలో ఇలాంటి క్యాన్సర్ కి ట్రీట్మెంట్ చేస్తారని, తాతయ్యకు ఏమీ కాదని, అన్నింటికీ తాను ఉన్నానంటూ వాళ్ల నానమ్మకి భరసా ఇస్తాడు.