భార్యమీద ప్రేమతో ఇప్పటికీ శ్రీదేవి కోసం ఆ పని చేస్తున్న బోనీ కపూర్..?

First Published Oct 16, 2022, 3:42 PM IST

నటి శ్రీదేవి కంటే భర్త బోనీ కపూర్ కు ప్రాణం. ఆమె సడెన్ గా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోవడంతో తట్టుకోలేకపోయాడట బోని కపూర్. అందుకే శ్రీదేవి కోసం బోనీ కపూర్ ఓ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడట. ఎవరు మర్చిపోయినా... ఆయన మాత్రం ఆ విషయాన్ని మర్చిపోరట. 

ఫిల్మ్ ఇండస్ట్రీకి దొరికిన దేవకన్య శ్రీదేవి.  సినిమాల్లో ఆమె నటన సౌందర్యానికి అతిలోక సుందరిగా పేరు వచ్చిందంటే.. ఆడియన్స్  మనసుల్లో ఆమె  ఎంతలా నాటుకపోయిందో తెలుస్తుంది. మరి అటువంటి శ్రీదేవి హఠాత్మరణం అందరికి కలిచివేసింది. ఈమె స్మృతులను మర్చిపోలేని భర్త బోనీ కపూర్... శ్రీదేవికోసం ఇప్పటికీ ఓ పనిని మర్చిపోకుండా చేస్తున్నారట. గుర్తు పెట్టుకుని మరీ ఆమెకు ఇష్టమైన పనిని కంటీన్యూ చేస్తున్నాడ. 

Boney Kapoor Sridevi

కొన్ని సంవత్సరాల పాటు ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలింది శ్రీదేవి. తెలుగు,తమిళ, మలయాళ పరిశ్రమతో పాటు.. హిందీని కూడా వందలాది సినిమాల్లో నటించి మెప్పించి దేవతగా పేరు సంపాదించింది శ్రీదేవి.  తన నటనతో ఫిలిం ఇండస్ట్రీ ని ఏలేసిన నటి శ్రీదేవి. అతిలోక సుందరిగా... కుందనపు  బొమ్మగా.. ఎన్నో రకాలుగా పిలవడిని ఆమె హాటాత్తుగా మరణించి అందరిని శోఖ సంద్రంలో ముంచి వెల్లిపోయింది. 

బోణీ కపూర్ తో పెళ్ళి తరువాత చాలా గ్యాప్ తీసుకున్న శ్రీదేవి.. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి  సినిమాలు చేస్తుంది అనుకున్న టైమ్ కు.. శ్రీదేవి ఎవ్వరు ఊహించని విధంగా 2018 ఫిబ్రవరి 24న దుబాయ్లో ఓ హోటల్లో అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఈ విషయంలో అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఆమె మరణానికిగల కారణాలు తెలియదు. 

 తన ఆస్తి కోసం బోనీ కపూర్ ఈ పని చేశాడని విమర్షలు కూడా వచ్చాయి. సూసైడ్ అని ఒకరు, కాదు కాలు జారి పడి చనిపోయందని కొందరు.. ఇలా చాలా రకాల వాదను వినిపించాయి.  ఎవరుఎన్ని అనుకున్నా శ్రీదేవిపై ప్రేమను ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నాడు బోనీ కపూర్.  ప్రేమించి పెళ్ళి చేసుకన్నారు  శ్రీదేవి - బోని కపూర్. ఆమె సినిమాలో నటించే టైంలోనే బోనికపూర్ తో డేటింగ్ చేసింది. 

ఈ క్రమంలోనే ఆయనతో డేటింగ్ చేస్తూ.. ఆమె ప్రెగ్నెంట్ అయింది. దీంతో 1996 జూన్ రెండున సింపుల్ గా ..  ఏఆర్భాటం లేకుండా వీరు పెళ్ళి చేసుకున్నారు. అయితే బోనీకి అంతకు ముందే పెళ్ళి అయ్యింది. ఆయన మొదటి భార్య కొడుకే అర్జున్ కపూర్. ఆయన ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకడిగా ఉన్నారు. ఇక వీరిద్దరికి జాన్వీ కపూర్- ఖుషీ కపూర్ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  శ్రీదేవి మరణించిన తర్వాత కొన్నాళ్లు బోనీకపూర్ డిప్త్రెషన్ కి పోయారట. 

ఆ తర్వాత డాక్టర్స్ ట్రీట్మెంట్ తో పాటు.. విదేశాల్లో కొన్ని థెరఫీలు తీసుకోవడంతో..  నార్మల్ కండిషన్లోకి వచ్చారట బోనీ కపూర్. ఇక ఆమెను మర్చిపోలేక పోయిన ఆయన..  శ్రీదేవికిచ్చిన మాటను మాత్రం  నెరవేరుస్తూ... ఆమెను సంతోషపెడుతున్నారట.  శ్రీదేవికి ఫస్ట్ నుంచి పేద పిల్లలకు అన్నదానం చేయడం అలవాటు ఉందట. ఇంట్లో ఏ పండగ జరిగినా.. ఆమె పేదవారికి అన్నదానం చేస్తుందట. ముఖ్యంగా ఎవరు పుట్టినరోజు జరిగినా..? వీళ్ళ పెళ్లిరోజు అయినా అన్నదానం చేస్తుందట. 
 

అమ్మ నాన్న లేని పిల్లలకి కూడా ఆమె చేయూతనందిస్తుందట. ఇక ఈ క్రమంలో ఆమె ప్రస్తుతం శ్రీదేవి మరణించినా.. ఆమె ఈ లోకాన లేకపోయినా సరే బోనీకపూర్ ఆమె ఇష్టాన్ని కొనసాగిస్తున్నాడట. అంతే కాదు  ఆమె పుట్టినరోజుకి.. వాళ్ళ పెళ్లి రోజుకి పిల్లల పుట్టిన రోజులకి ఇంకా ఏ సందర్భం వచ్చినా..  శ్రీదేవి పేరిట అన్నదానం చేస్తున్నారట. 

అంతే కాదు శ్రీదేవి పేరు మీద ఇవే కాకుండా పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడట బోనీ కపూర్. వాటికి ప్రచారాలు చేసకోకుండా.. రహస్యంగా ఉంచుతున్నాడట. ఎంతో మంది పేదవారికి సహాయం చేస్తూ..అందులో తన భార్యను చూసుకుంటున్నాడట బోనీ. 

click me!