ఇలాగే చెన్నైలోని గవర్నర్ భవనం, సీఎం, బీజేపీ ఆఫీసు, నటుడు ఎస్వీ శేఖర్ ఇళ్లకు కూడా బెదిరింపులు వచ్చాయి. తనిఖీల్లో అవన్నీ ఫేక్ అని తేలింది. ఈ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు అన్న విషయంపై విచారణ కొనసాగుతోంది.