ఈ ఏడాది బచ్చన్ ఫ్యామిలీ 100 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. 2024లో రియల్ ఎస్టేట్లో అత్యధికంగా పెట్టుబడి పెట్టిన స్టార్ గా అమితాబ్ బచ్చన్ ఉన్నారు. బచ్చన్ కుటుంబం రియల్ ఎస్టేట్లో వంద కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. అమితాబ్ బచ్చన్ 70 కోట్లు, అభిషేక్ బచ్చన్ 30 కోట్లు పెట్టుబడి పెట్టారని సమాచారం. అమితాబ్ కి ఇండియా వైడ్ పాపులారిటీ ఉంది. తెలుగులో ఆయన తరచుగా చిత్రాలు చేస్తున్నారు. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కిలో అశ్వద్ధామ పాత్రలో అలరించారు.