47 ఏళ్ళ వయస్సులో ... గుడ్ న్యూస్ చెపుతానంటోన్న సుస్మితా సేన్

First Published Nov 19, 2022, 8:09 PM IST

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది బాలీవుడ్ సీనియర్ బ్యూటీ సుస్మితాసేన్. వరుసగా బాయ్ ఫ్రెండ్స్ ను మారుస్తూ వస్తోన్న ఈస్టార్ బ్యూటీ.. 47 ఏళ్ళ వయస్సులో మరో గుడ్ న్యూస్ చెపుతానంటోంది. 

వరుసగా బాయ్ ఫ్రెండ్స్ ను మార్చడంలో బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేను ముందు వరసలో ఉంటుంది. అంతే కాదు తనకంటే చిన్నవాడైన రోహాన్ తో  డేటింగ్ చేసి.. సంచలనంగా మారింది సుస్మిత. 
 

ఆ మధ్య ఐపియల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీతో కొత్తగా డేటింగ్ మొదలుపెట్టినట్టు ప్రకటించిన ఈ బ్యూటీ.. ఆ తరువాత అతనితో పెద్దగా కనిపించలేదు. వీరిద్దరుపెళ్ల చసుకుంటారు అని అనుకున్నారంతా.. కాని వీరుబ్రేకప్ చెప్పుకున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. 
 

అయితే కలిసుండే విషయాన్ని అఫిషియల్ గా ప్రకటించిన ఈ జంట.. ఇప్పుడు కలిసున్నారా..? లేక విడిపోయారా అన్నది మాత్రం తెలుపలేదు. వ్యక్తిగత బంధాలతో ఎప్పుడూ  వార్తల్లో ఉండే బాలీవుడ్ సీనియర్ నటి సుస్మితా సేన్ మరోసారి ఇన్ స్టా గ్రామ్ లో ఫ్యాన్స్ ను పలకరించింది. 

తనకు 47  వచ్చిన సందర్భంగా సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్ట్ పెట్టింది. మొత్తానికి 47 వచ్చాయి..  13 ఏళ్లుగా ఈ సంఖ్య నన్ను ఫాలో అవుతోంది. అపురూపమైన సంవత్సరం రాబోతోంది. చాలా కాలంగా ఇది నాకు తెలుసు. చివరికి దీని రాకను ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాను అని అన్నారు. 

అంతే కాదు  మిమ్మల్ని అభిమానిస్తున్నాను అంటూ ఇన్ స్టా గ్రామ్ పై సుస్మితా సేన్ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ ను అభిమానులు రకరకాలుగా అర్ధం చేసుకుంటున్నారు. ఫైనల్ గా ఈ ఏడాది సుస్మిత ఏదైనా శుభవార్త చెబుతుందేమోనని భావిస్తున్నారు. 
 

Susmitha sen with Rumoured boy friend

ఇక ఈ పోస్ట్ కు రకరకాలు కామెంట్లు రాగా.. సుస్మిత మాజీ బోయ్ ఫ్రెండ్ రోహన్ రెడ్ హార్ట్ ఎమోజీతో రిప్లయ్ ఇచ్చాడు. లలిత్ మోదీతోనూ సుస్మిత డేటింగ్ చేస్తున్నట్టు ప్రకటించినా..? ఎక్కువగా బయట రోహాన్ తోనే కనిపిస్తోంది సీనియర్ బ్యూటీ. 
 

అంతే కాదు తను డేటింగ్ చేయడం తప్ప పెళ్లి మాత్రం చేసుకోనంటోంది. అందుకే పెళ్లి చేసుకోకుండా పిల్లలను దత్తత తీసుకుని పోషిస్తూ.. మరోవైపు తన మనసుకు నచ్చిన వారితో సహజీవనం చేసుకుంటూ వెళ్తోంది బ్యూటీ. 

click me!