బాలీవుడ్ తో పాటు.. టాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా తనదైన ముద్ర వేసింది ప్రీతి జింటా. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా..టాప్ హీరోయిన్ క్రేజ్ ను ఇక్కడ కూడా సొంతం చేసుంది. ఎందుకంటే ఆమె హిందీ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. అందుకే ప్రీతీ జింటా అనగానే సొట్టబుగ్గల సుందరి కళ్ల ముందు కదులుతుంది.
వాటితో పాటు 35 లక్షల విలువ చేసే Lexus LX 470 అలాగే..మిత్సుబిషి లాన్సర్ కారు ధర 7.4 లక్షల విలువ చేసేవి ఉన్నాయి. బాలీవుడ్ లోనే కాదు.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కు ఇన్ని కార్లు ఉండి ఉండవు అంటున్నారు నెటిజన్లు.
ఇక తెలుగులో ప్రీతీ జింట ఇద్దరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. విక్టరీ స్టార్ వెంకటేష్ జతగా.. ప్రేమంటే ఇదేరా సినిమాలో నటించిన ప్రీతి.. సూపర్ స్టార్ మహేష్ బాబు జంటగా.. రాజకుమారుడు సినిమాలో నటించి మెప్పించింది. ఆతరువాత ఆమెకు టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు రాలేదు. దాంతో బాలీవుడ్ కే పరిమితం అయిన ప్రీతి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ కింగ్స్ టీమ్ కు పార్టర్ గా ఉన్నారు. మ్యాచ్ ఉందంటే చాలు.. స్టేడియంలో ప్రీతీ జింట సందడి చేయాల్సిందే.. తమ టీం పంజాబ్ కింగ్స్ ను ఎంకరేజ్ చేస్తూ.. ఆమె చేసే డాన్స్.. విన్యాసాలు అందరికి ఆకర్షిస్తుంటాయి. ఇక ప్రతీ జింట చాలా కాలంగా సినిమాలకు దూరం అయ్యారు. తాజా సమాచారం ప్రకారం ఆమె.. బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. సన్నీ డియోల్ జోడిగా లాహోర్ 1947 చిత్రంలో ప్రీతి నటిస్తుంది.