ఆ జంట నన్ను టార్గెట్ చేశారు, మానసికంగా వేధిస్తున్నారు.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

First Published Feb 7, 2023, 1:51 PM IST

ఓ బాలీవుడ్ స్టార్ కపుల్ పై సంచలన  వ్యాఖ్యలు చేసింది ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. తనను టార్గెట్ చేస్తూ.. మానసికంగా వేధిస్తున్నారంటు ఆరోపణలు చేసింది.. పేరు పెట్టి చూపించకపోయినా.. కంగనా ఆరోపణలు చేస్తున్న జంట ఎవరంటే..? 

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ కంగనా రనౌత్. ఉన్నట్టు మాట్లాడటం.. ఎంత పెద్ద స్టార్ అయినా.. తప్పును ఎత్తి చూపడం.. ఎదిరించి నిలండటం కంగనాకు కామన్. ఈ విషయంలో చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేసింది బ్యూటీ.  బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది.. కాంట్రవర్సీలలో మునిగి తేలిన కంగనా.. ప్రస్తుతం ఓ బాలీవుడ్ యంగ్ కపుల్ ను టార్గెట్ చేస్తూ.. ఆరోపణలు చేస్తోంది. 

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ కపుల్ తనపై నిఘా పెట్టిందని... తన ప్రతి కదలికను వాళ్లిద్దరు గమనిస్తున్నారని.. అంతే కాకుండా తన పర్సనల్ ఇన్ ఫర్ఫర్మేషన్ ను కలెక్ట్ చేసి.. లీక్ చేస్తున్నారంటూ మండిపడింది. ఇలా చేసి తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో ఓ పెద్ద నోట్ రాసుకొచ్చింది కంగనా. ప్రస్తుతం అ వార్త సోషల్ మీడియాను కుదిపేస్తోంది. 

Image: Kangana Ranaut Instagram

ఆ జంట పేరు చెప్పకుండా కడిగిపారేసింది కంగనా. ఏమని ఆరోపణలు చేసిందంటే.. గత కొంత కాలంగా నేను ఎక్కడికి వెళ్తున్నాను.. ఏం చేస్తున్నాను అనేది మనుషుల్నీ పెట్టి మరీ గమనిస్తున్నారు.. అంతే కాదు  నా ఇంటి దగ్గర కూడా ఎప్పటికప్పుడు ఏం జరిగేది తెలుసుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు. నా మీద నా కదలికల మీద బాలీవుడో జంట  నిఘా పెట్టారు అంటూ సంచలన కామెంట్స్ చేసింది కంగనా రనౌత్. 

అయితే ఆ జంట ఎవరు అన్న విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈమధ్య కంగనా బాలీవుడ్ యంగ్ కపుల్ రణ్ బీర్ - ఆలియా భట్ లను టార్గెట్ చేస్తుంది. దాంతో ఈ ఆరోపణలు కూడా వాళ్ల గురించే చేసి ఉంటుంది అంటూ నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.  

Kangana Ranaut Allegedly Hints ‘Casanova’ Ranbir Kapoor

అయితే ఆ జంట ఎవరు అన్న విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈమధ్య కంగనా బాలీవుడ్ యంగ్ కపుల్ రణ్ బీర్ - ఆలియా భట్ లను టార్గెట్ చేస్తుంది. దాంతో ఈ ఆరోపణలు కూడా వాళ్ల గురించే చేసి ఉంటుంది అంటూ నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.  

 అంతేకాదు నా కారు పార్కింగ్, నేను మేడపై ఏం చేస్తున్నాను అన్న విషయంపై నిఘా పెట్టి గమనిస్తున్నారు. నేను ఉదయం 6 గంటలకు బయటకు వెళ్తే నన్ను ఫాలో అవుతూ.. నా ఫోటోలు తీస్తున్నారు. ఇక నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలే కాదు.. వృత్తిపరమైన విషయంలో కూడా జోక్యం చేసుకుంటూ.. నానా ఇబ్బందులు పెట్టడానికి చూస్తున్నారన్నది కంగనా రనౌత్. 

అక్కడితో ఆగకుండా.. నా వాట్సప్ డేటా కూడా  కలెక్ట్ చేసి లీక్ చేస్తున్నారని అనుమానం కలుగుతోంది అంటోంది  కంగనా.అంతటితో ఆగకుండా  నా దగ్గర  పనిచేసే వారిని కూడా ప్రలోభపెట్టి.. మాయమాటలు చెప్పి వాళ్ళవైపు తిప్పుకుంటున్నారంటోంది. ఈరకంగా తనను ఒంటరిని చేసే ప్రయత్నం చేస్తున్నారంటోంది కంగనా.

ఆ హీరో తన భార్యను నిర్మాతగా మార్చాడు, నా లాగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని చూస్తున్నారు.. నన్న ఎంతలా ఫాలో అవుతున్నారంటే.. ఆకరికి నా డ్రెస్ ను కూడా కాపీ కొట్టి.. ఆ హీరోయిన్ అదే డ్రస్ వేస్తుంది అంటూ కంగనా రనౌత్ ఆరోపణలు చేసింది. ఇక తన డేటాను ఆహీరో ఎలా కలెక్ట్ చేస్తున్నాడో తెలిసితే.. అతను ప్రమాదంలో పడినట్టు అంటుంది బ్యూటీ. 

ప్రస్తుతం కంగనా రనౌత్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. సౌత్ లో చంద్రముఖి 2,  బాలీవుడ్ లో ఎమర్జెన్సీ  సినిమాల్లో  నటిస్తుంది. ఎమర్జెన్సీ సినిమాలో ఇందిరగాంధి పాత్రలో నటిస్తున్న కంగనా.. ఈ మూవీకి డైరెక్టర్ గా.. నిర్మాతగా వ్యవహరిస్తుంది. 

click me!