సినిమా కోసం ఆస్తులు అమ్ముకున్న కంగనా రనౌత్, ఆందోళనలో అభిమానులు

First Published Jan 22, 2023, 2:27 PM IST

సినిమా కోసం సిన్సియర్ గా ప్రయత్నం చేయడంలో కంగనా రనౌత్ రూటు సపరేటు. సినిమా అంటే చాలు ప్రాణం పెట్టేస్తుంది బ్యూటీ.  ఈక్రమంలోనే కంగనా తన సినిమా కోసం ఓ సాహసం కూడా చేసిందంట. 

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్  గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది... ఫైర్ బ్రాండ్,  మల్టీ టాలెంటెడ్, బ్యూటిఫుల్ హీరోయిన్.. ఇండస్ట్రీలో ఎవరు ఏమన్నా.. తను అనుకున్న ఆలోచన ప్రకారం ముక్కుసూటిగా వెళ్తుంది బ్యూటీ. ఇలా ఉండటం వల్లే బాలీవుడ్ కు కంగనాకు పడటం లేదు. అయినా సరే ఒక్కతే యుద్దం చేస్తూ.. తను నమ్ముకున్నసినిమా కోసం కష్టపడుతుంటుంది. 
 

ప్రస్తుతం ఎమర్జెన్సీ సినిమా చేస్తుంది కంగనా రనౌత్. ఈసినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్యంయంగా నిర్మిస్తుంది. అంతే కాదు ఈసినిమాకు డైరెక్టర్ కూడా తానే. ఈ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రలో కనిపించబోతుంది కంగనా. ఇందిరా గాంధీ అధికారంలో ఉండగా  ఏర్పడిన ఎమర్జెన్సీ నేపథ్యంలో జరిగిని సంఘటలన ఆధారంగా  ఈ సినిమాను కంగనా తెరకెక్కిస్తోంది. 
 

ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. అయితే ఈసినిమాకు కంగనా స్వయంగా ఈ బడ్జెట్ ను ఒక్కతే భరిస్తూ..ప్రొడ్యూస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నుంచి ఆమెకు పెద్దగా సహాయం అందండంలేదట. దాంతో ఈ సినిమా కోసం ఆమె చాలా కష్టపడుతున్నట్లు మూవీ టీమ్ చెపుతున్నారు. దాంతో కంగనా రకరకాల ఇబ్బందులుఫేస్ చేస్తోంది. 

ఈ సినిమా షూటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది అనుకున్న టైమ్ లో కంగనా డెంగ్యూ బారిన పడింది. ఆ తరువాత ఈ సినిమా భడ్జెట్ ను తీసకురావడం కోసం కంగనా రనౌత్  తన ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను కంగనా పూర్తి చేసినట్లు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. 

ఈ పోస్ట్ లో కొన్ని ఫోటోస్ తో పాటుగా అసలు విషయాన్ని కూడా వెల్లడించింది కంగనా రనౌత్. ఈసినిమా కోసం తన ఆస్తులన్నీ తాకట్టు పెట్టినట్లుగా ఆమె పేర్కొంది. తాను శారీరకంగా, మానసికంగా కూడా చాలా కష్టాలను ఎదుర్కొంటున్నట్లుగా కంగనా తెలిపింది.

అయితే ఈ విషయం తెలిసి ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. దాంతో ఏం పర్వాలేదని ఇప్పుడు తాను బాగానే ఉన్ననాంటు ప్రకటించింది సీనియర్ బ్యూటీ.  దాంతో కంగనా కమిట్మెంట్‌కు హ్యాట్సాఫ్ అంటున్నారు ఫ్యాన్స్.  అభిమానులు.

click me!