ప్రోమోలో హైలైట్స్ ఒకసారి పరిశీలిస్తే.. ఫుడ్ విషయంలో బేబక్క, సీత మధ్య చర్చ జరిగింది. రూల్స్ ని అతిక్రమించి రెండు కూరలు ఎందుకు చేశారు అని సీత ప్రశ్నించింది. వెజిటేరియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం రెండో కర్రీ చేసినట్లు బేబక్క తెలిపింది. సోనియా ఆకుల కూడా మరోసారి రెచ్చిపోతూ మాట్లాడింది. మణికంఠ, అభయ్ నవీన్ మధ్య కూడా వాగ్వాదం జరిగింది. వీళ్లిద్దరి గొడవలో మణికంఠ ఒక మాట అన్నారు. నేను అన్ ఫిట్ అయితే ఈ వారమే హౌస్ నుంచి వెళ్ళిపోతా అని అన్నాడు.