బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ జంటలపై నాగార్జున ఫోకస్, ఆ ఐదుగురికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కింగ్

First Published Sep 24, 2022, 11:27 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్ రసవత్తరంగా సాగుతోంది. శనివారం కింగ్ నాగార్జున వచ్చి రావడంతోనే.. జోకులు పేలుస్తూనే.. క్లాస్ కూడా పీకాడు.. అంతే కాతు ఈసారి  హౌస్ లో ప్రేమ కథలపై  దృష్టి పెట్టాడు కింగ్. 
 

ఈ శనివారం బిగ్ బాస్ హౌస్ చాలా ఇంట్రెస్ట్ గా సాగింది. కింగ్ నాగార్జున రావడం క్లాస్ పీకేవారికి క్లాస్ పీకడం, బాగా ఆడిన వారిని మెచ్చుకోవడం.. ప్రేమికులపై సెటైర్లు వేయడం.. ఇలా సరదాగా సాగింది బిగ్ బాస్ ఎపిసోడ్. ఈ సారి సాఫ్ట్ గా ఉంటాడు..మంచోడు అనుకుంటున్న బాలాదిత్యకు కూడా ఈసారి గట్టిగా షాక్ ఇచ్చాడు నాగార్జున. 
 

ఈ వీక్ ఆటతీరుకుసబంధించి అందరికి మార్కులు ఇచ్చాడు నాగార్జున. ఆట తీరు మెరుగు పరుచుకున్న శ్రీహాన్, శ్రీ సత్యలలను అభినందించాడు. ఇక ఆటతీరులో వెనుకబడ్డ శ్రీరాజ్, చంటీ, అర్జున్ కల్యాణ్ లను వెనక్కి పంపించేశాడు. కెప్టెన్ గా నిద్రపోయావంటూ శ్రీ రాజ్ కు కూడా పంచులు విసిరాడు నాగార్జున. ఇక ఆట తీరులో గీతూ, ఆదిరెడ్డి,శ్రీ సత్యలు 10 మార్కులు తెచ్చుకుని టాప్ లో నిలిచారు. మరికొందరికి 9మార్కులు రాగా.. కీర్తి, వాసంతి లాంటి వారు అతి తక్కువ మార్కులు తెచ్చుకున్నారు. 

ఇక ఈసారి హౌస్ లో ప్రేమ కథల గోల ఎక్కువగా వినిపించింది. ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడంకోసం నాగ్ ఈసారి రొమాంటిక్  స్టోరీ్ ను బయటకు తీశాడు. ఫోటోస్ తో సహా.. ప్రేమ కథల వినిపించాడు. ముఖ్యంగా హౌస్ అంతా సూర్య-ఆరోహీ రిలేషన్ గురించే ఎక్కువగా డిస్కర్షన్స్ జరిగాయి. వారు ఎక్కడెక్క.. ఏం చేశారు.. ఫోటోతోసహా నిరూపించాడునాగార్జున. 
 

మరో వైపు అర్జున్ కల్యాణ్ శ్రీసత్య కోసం బాగా ట్రై చేస్తుననాడంటూ.. ఆడియన్స్ తో చెప్పించాడు నాగ్. ఈసారి ఎక్కుగా   ఆడియన్స్ ను ఇన్ వాల్వ్ చేసి.. హౌస్ మెట్స్ లో బయట ఏం అనుకుంటున్నారోతెలిసేలా గేమ్ ను మార్చాడు. పర్ఫామెన్స విషయంలె వీక్ గా ఉన్నవారికి చురకలంటించి.. వారు ఇంప్రూ అయ్యేలా ప్లాన్ చేశాడు. కాని అందులో కొంత మంది మాత్రం ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టు ఉండిపోయారు. 

ఇక హస్ లో జరిగిన కాంట్రవర్సీల గురించి వరుసగా తేల్చేశాడు కింగ్.. శ్రీహాన్ పిట్ట కథతో పాటు.. ఇనాయా వాడు అనే వాడుక పదం.. రేవంత్ టెంపర్.. సుధీప మనిషి అయితే  అన్న మాట వరకూ అన్ని విషయాలను క్లియర్ చేసి.. ఒక్కొక్కరికి సున్నితంగా క్లాస్ పీకి వదిలిపెట్టాడు. అంతే కాదు నేహా, ఫైమాలు చేసిన పని మర్చిపోతే.. వారికి వీడియోలు చూపించి మరీ.. వారు చేసిన పొరపాట్లను తెలిసేలా చేశాడు. 
 

ఇక నాగార్జునకు ఎంతో ఇష్టమైన గీతూకు కూడా స్వీట్ వర్నింగ్ ఇచ్చాడు నాగ్. నోటి దూల ఎక్కువయ్యిందన్నట్టుగా.. చెప్పిన హోస్ట్ కాస్త తగ్గించుకోమంటూ.. నవ్వుతూనే చురకేశాడు. ఇక ఈసారి షాకంగ్ విషయం ఏంటీ అంటే.. హోస్ట్ కు ఇద్దరిని డైరెక్ట్ గా ఎలిమినేషన్ కోసం నామినేట్ చేసే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. అయితే నాగార్జున మాత్రం ఆ ఛాన్స్ కూర్చున్న సభ్యులకు ఇచ్చాడు. సోఫా వెనకు ఉన్న వారిలో నామినేషన్ కోసం ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తారంటూ నాగ్ అడగగా.. కీర్తీకి, అర్జున్ కల్యాణ్ కు ఎక్కువ మార్కులు పడ్డాయి. వారిద్దరు ఈసారి   డైరెక్ట్ గా నామినేట్ అయ్యారు. 

click me!