`బిగ్ బాస్ తెలుగు సీజన్ 9` ఆదివారం సాయంత్రం గ్రాండ్గా ప్రారంభమైంది. 15 మంది కంటెస్టెంట్లు హౌజ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సారి తొమ్మిది మంది సెలబ్రిటీలను, ఆరుగురు కామనర్స్ ని కంటెస్టెంట్లుగా ఎంపిక చేశారు. వీరిలో భరణి, తనూజ, శ్రష్టి వర్మ, ఫ్లోరా సైనీ, రీతూ చౌదరీ, ఇమ్మాన్యుయెల్, రాము రాథోడ్, సుమన్ శెట్టి, సంజనా గల్రానీ సెలబ్రిటీలుగా హౌజ్లోకి ఎంట్రీ ఇవ్వగా, మర్యాద మనీష్, పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్, దమ్ము శ్రీజ, ప్రియాలు, హరీష్ కామనర్స్ గా హౌజ్లోకి వచ్చారు. వీరిలో కామనర్స్ మెయిన్ హౌజ్లో, సెలబ్రిటీలు ఔట్ హౌజ్లో ఉన్నారు. వీరి మధ్య ఫైటింగ్ ఎలా ఉండబోతుందో నేటి నుంచి తేలనుంది.