బిగ్ బాస్ ఇంటి సభ్యులను రెండుగా విభజించిన విషయం తెలిసిందే. రణధీర టీమ్ లో శివాజీ, షకీలా, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక, ప్రిన్స్ యావర్ ఉన్నారు. ఇక మహాబలి టీంలో తేజా, పల్లవి ప్రశాంత్, శుభశ్రీ, దామిని, గౌతమ్ కృష్ణ, రతికా రోజ్ ఉన్నారు. బిగ్ బాస్ నిర్వహించిన రెండు రౌండ్స్ లో రణధీర టీమ్ గెలిచింది. అందుకే మాయాస్త్ర వారి సొంతం అయింది. రణధీర టీంలో ఉన్న 6గురు సభ్యుల్లో ఒకరికి పవర్ అస్త్ర దక్కనుంది.