ఇక పల్లవి ప్రశాంత్ పేరు పిలవగా గౌతమ్ కృష్ణ, ప్రియాంక సింగ్, అమర్ దీప్ చౌదరి, రంగంలోకి దిగారు. పల్లవి ప్రశాంత్ ని ప్రియాంక, అమర్ దీప్ చౌదరి స్ట్రాంగ్ గా టార్గెట్ చేశారు. నువ్వు రైతు బిడ్డ అని చెప్పుకోవడానికి వీలు లేదు అన్నట్లు వాదించారు. రైతులే కాదు అన్ని రంగాల్లో ఇబ్బందులు ఉన్నాయి. నువ్వు సింపతీ వాడకు అని అమర్ దీప్ చౌదరి గట్టిగా చెప్పాడు. రైతుబిడ్డ అనే కామనర్ కి భారీగా ఓట్లు పడుతున్నాయని అమర్ దీప్ చౌదరి, ప్రియాంక సింగ్ గ్రహించారు. ఆ సింపతీ యాంగిల్ దూరం చేయాలని గట్టి ప్రయత్నం చేశారు.