బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో పవన్ అభిమానుల ఫస్ట్ టార్గెట్ ఫిక్స్...

First Published Sep 7, 2020, 6:06 PM IST

తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కంటెస్టెంట్ ని టార్గెట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.

ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ అట్టహాసంగా నిన్న ప్రారంభమయింది. నాగార్జున హోస్ట్ గా 16 మంది కంటెస్టెంట్లతో షో ప్రారంభమయింది. షో ఎలా వుండబోతుందనే విషయాన్నీ పక్కనబెడితే.... ఇప్పటికే నేటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని వదిలారు.
undefined
ఈ ప్రోమోలో ఎలిమినేషన్ లో గంగవ్వ మాస్ అంటూ రాసుకొచ్చింది బిగ్ బాస్ టీం. ఎలిమినేషన్ గురించి చర్చ రావడంతో సోషల్ మీడియాలో ఈసారి ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు అన్న చర్చ మొదలయ్యింది. ఇక బిగ్ బాస్ గురించి, దాని అప్డేట్స్ గురించి సోషల్ మీడియాలో జరిగే రచ్చ అంత ఇంతా కాదు.
undefined
తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కంటెస్టెంట్ ని టార్గెట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ సీజన్లపై పవన్ ఫ్యాన్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు.
undefined
వచ్చిన ప్రతి కంటెస్టెంట్ కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల మద్దతు తమకు దక్కితే బాగుండును అని అనుకుంటూనే ఉంటారు. పవన్ అభిమానుల మద్దతు దక్కించుకున్నవారు బిగ్ బాస్ హౌస్ విన్నర్లు కూడా అయ్యారు. గత సీజన్లలో కంటెస్టెంట్స్ తరుపు బంధువులు మెగా అభిమానుల మద్దతు కూడా కోరారు.
undefined
ఇక తాజాగా ఈ సీజన్లో పవన్ అభిమానులు దేవి నాగవల్లిని సాధ్యమైనంత త్వరగా ఎలిమినేట్చేయాలనిబలంగా ఫిక్స్ అయ్యారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. దీనికి దేవితో వారికున్న శత్రుత్వం కాదు, టీవీతో వారికున్న వైరం.
undefined
తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యా పై హీరోయిన్ మాధవి లతా ఒక అనుచిత వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే. దీనితో ఆ క్లిప్ ని పదే పదే టీవీ9 ప్రసారం చేయడంతో... జనసేన బహిరంగ లేఖ ద్వారా టీవీ వైఖరిని తప్పు పట్టింది కూడా.
undefined
పవన్ అభిమానులు ఏకంగా షేమ్ ఆన్ టీవీ9 పేరుతో ఒక హ్యాష్ ట్యాగ్ ని కూడా ట్రెండ్ చేసారు. దీనిపై చాలా తీవ్రంగా స్పందించిన పవన్ ఫ్యాన్స్ టీవీ9 గతంలో ప్రసారం చేసిన వాటిని వెతికి ట్రోల్స్ రూపంలోసోషల్ మీడియాలోపోస్ట్ చేస్తున్నారు.
undefined
గతంలో శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా టీవీ9 చీప్ పబ్లిసిటీ కోసం ఇలానే ప్రసారం చేసిందని గుర్తు చేస్తున్న అభిమానులు.... టీవీ9 దేవి నాగవల్లి ని టార్గెట్ చేసినట్టుగా సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తుంది. చూడాలి ఎంతమేర ఇది నిజమవుతుందో..!
undefined
click me!