మూడో పెళ్లి వివాదం ముగియక ముందే మరో కష్టం: నటి ఆవేదన

First Published Aug 26, 2020, 5:56 PM IST

వనితా విజయ్‌కుమార్ భర్త పీటర్ పాల్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయాన్ని వనిత తన సోషల్ మీడియా పేజ్‌లో వెల్లడించింది. వివాదాల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న తరుణంలో ఇలా జరగటంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.

వివాదాస్పద నటి వనితా విజయ్‌ కుమార్‌ ఇటీవల మీడియాలో ఓ రేంజ్‌లో హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆమె పీటర్‌ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకోవటం కోలీవుడ్‌ పెద్ద రచ్చకు కారణమైంది. ఎదిగిన కూతుళ్ల ముందు పెళ్లి, ముద్దులు ఏంటి అంటూ నెటిజెన్లతో పాటు సినీ ప్రముఖులు కూడా విమర్శించారు. అయితే ఆ విమర్శలకు వనితా ప్రతి విమర్శలు ఇవ్వటం, తరువాత మరిన్ని కామెంట్లు రావటంతో విషయం పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లింది.
undefined
ఇప్పుడిప్పుడే జనం ఈ గొడవ మర్చిపోతున్న తరుణంలో వనిత మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె భర్త పీటర్ పాల్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయాన్ని వనిత తన సోషల్ మీడియా పేజ్‌లో వెల్లడించింది. వివాదాల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న తరుణంలో ఇలా జరగటంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.
undefined
`చాలా చెప్పాలి. కానీ ఏం చెప్పలేను. దేవుడు చాలా గొప్పవాడు. జరిగిన ప్రతీ సంఘటనకు ఓ కారణంగా ఉంటుంది. జీవితం కష్టంగా ఉంటుంది. కానీ దాన్ని ఎదిరించాలి. నన్ను నమ్మండి అన్ని సర్దుకుంటాయి. ధైర్యంగా ఉండండి, ప్రపంచానికి మీరెంటో చూపించండి` అంటూ ట్వీట్ చేసింది.
undefined
పీటర్‌ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే వనితను వివాహం చేసుకోవటం తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ విషయంలో పీటర్ మొదటి భార్య ఎలిజబెత్‌ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే వనిత మాత్రం ఎలిజబెత్‌ డబ్బు కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తుందంటూ ఆరోపించింది.
undefined
నటులు మంజుల, విజయ్‌కుమార్‌ల వారసురాలిగా 1995లో చంద్రలేఖ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది వనితా. అయితే సినిమాల్లో పెద్దగ ఆకట్టుకోలేకపోయినా వరుస వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది.
undefined
click me!