బిగ్ బాస్ కౌశల్ మందా నన్ను టార్గెట్ చేశాడు హోస్ట్ నాని కూడా... వాడు బాగుపడింది ఏముంది... తేజస్వి సంచలనం 

First Published Aug 25, 2022, 10:54 PM IST

బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ ఆర్మీ తనని దారుణంగా ట్రోల్ చేసినట్లు ఆమె చెప్పారు. వాడు బాగుపడింది ఏముంది అన్న తేజస్వి నటుడు కౌశల్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
 

tejaswi madivada

తేజస్వి మాదివాడ నటించిన కమిట్మెంట్ మూవీ ఇటీవల విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్స్ పాల్గొన్న తేజస్వి అనేక విషయాలు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కౌశల్ ఆర్మీ నన్ను భయంకరంగా ట్రోల్ చేశారు. అయిన వాళ్ళు అవన్నీ చూసి నన్ను పట్టుకొని ఏడ్చారు.
 


ఆ దెబ్బతో రెండేళ్లు సినిమాలకు దూరం అయ్యాను. నన్ను అలా చేయించాడు. వాడు బాగుపడింది ఏముంది. నేను ఇంత బాధపడుతుంటే హౌస్ లో కుడి నాని నన్ను మాటలు అనేవారు. నానితో, బిగ్ బాస్ షోతో నేన్ను ఇబ్బంది పడ్డాను. 

విమర్శల తర్వాత నేను అవుట్ ఆఫ్ షేప్ అయ్యాను. మందు తాగడం అలా చేశాను. తర్వాత అనుకున్నాను. ఎవడో అనడం వలన నేను కెరీర్ మానేయడం ఏమిటీ. కమిట్మెంట్ సినిమాతో మరలా ఫార్మ్ లోకి వచ్చాను.


ఈ మూవీతో కమ్ బ్యాక్ కావాలని అనుకుంటున్నాను. ఇక కమిట్మెంట్ మూవీ ప్రమోషన్స్ లో ఆమె క్యాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలు కూడా చేశారు. ఆమెకు కూడా ఆ అనుభవాలు ఎదురైనట్లు చెప్పారు. ఇక శ్రీరెడ్డిపై కూడా ఆమె ఆరోపణలు చేయడం విశేషం. ఆమె చేసేవన్నీ చేసి మీటూ అంటూ ఆరోపణలు చేశారని విమర్శించారు. 

మరోవైపు కమిట్మెంట్ మూవీ ప్రమోషన్స్ కోసమే ఆమె ఇలా చేస్తున్నారనే ఆరోపాలు కూడా ఉన్నాయి. ఆమె నటించిన మూవీ ప్రచారం కల్పించడం కోసం ఇలా చేస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా ఆమె ఇలా వరుస ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.  

click me!